తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జనగామ జిల్లా లింగాలగణపురం మండలం నవాబ్ పేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
అర్ధరాత్రి కారు-లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇద్దరు మృతి...ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు హనుమకొండకు చెందిన ఇమ్రాన్, సుభాన్గా పోలీసులు గుర్తించారు.క్షతగాత్రులను జనగామ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

