సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24తో ముగియనున్న ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని, మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది.
కొత్తగా సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేయాల్సి ఉన్నా ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని పొడిగించారు.
మరో ఏడాది...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ 2027 మే 24వ తేదీ వరకూ పదవీలో ఉండనున్నారు. వివిధ కీలక కేసులు విచారణ దశలో ఉన్నందున ఆయన పదవీ కాలాన్ని పొడిగించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడి ఈ నిర్ణయం తీసుకుంది.

