Tollywood : ఢిల్లీలో భవనం కుప్పకూలి విద్యార్థులు మరణించడంపై నటుడు సోనూ సూద్ స్పందించారు. ఢిల్లీలోని సత్య నికేతన్ భవనం కూలిన ఘటన అత్యంత దురదృష్టకరమని సోనూ సూద్ అన్నారు.
విద్యార్థులకు సురక్షితమైన హాస్టల్స్ అందుబాటులో ఉండాలని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు.
లక్షలాది మంది విద్యార్థులు...ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్ కోసం, కలలను సాకారం చేసుకునేందుకు నగరాలకు వస్తున్నారన్న సోనూ సూద్ కానీ వారు ఇలా మృతి చెందడం విచారకరమని అన్నారు. ఢిల్లీకి ఏటా ఏడులక్షల మంది విద్యార్థులు వస్తున్నారని, కేవలం ముప్ఫయి వేల మందికి మాత్రమే హాస్టళ్లు సరిపోతాయని సోనూ సూద్ అన్నారు.

