Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో "అభివృద్ధి వర్సెస్ సంక్షేమం" అనేది ఎప్పుడూ అత్యంత కీలకం. తాజాగా రెండు రోజుల పాటు జరిగిన టీడీపీ కాన్ క్లేవ్ లో దీనిపై చర్చ జరిగింది.
కేవలం ఈ రెండు అంశాలే ఒక ప్రభుత్వానికి తిరిగి అధికారాన్ని తెచ్చిపెడతాయా లేదా అన్న దానిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. అభివృద్ధి, సంక్షేమం మళ్లీ గెలిపిస్తాయని అనుకోవడం సరికాదన్నారు. అలా అయితే హైటెక్ సిటీని నిర్మించిన ప్రాంతంలోనే 2004లో టీడీపీ ఓటమి పాలయిందన్నారు 2014లో అభివృద్ధి, సంక్షేమం చేసినప్పటికీ ప్రజలు ఆదరించలేదన్నారు. ప్రజలతో నేతలు మమేకమై మేం ఉన్నామన్న ధైర్యమిస్తేనే గెలుపు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను నియోజకవర్గాలను మార్చి గెలుస్తున్నానని అంటున్నారని, కానీ నియోజకవర్గాలు మారినా గెలవలేని వారు చాలా మంది నేతలున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఏ ఒక్క అంశంపైనో ఆధారపడి...ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పు ఏ ఒక్క అంశంపైనే ఆధారపడి ఉండదు. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది 2014-19 మధ్యకాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం అమరావతి, పోలవరం మరియు ఐటీ రంగం వంటి భారీ అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. అయితే, వైసీపీ ప్రకటించిన "నవరత్నాలు" వంటి విస్తృత సంక్షేమ పథకాలు, ప్రత్యక్ష నగదు బదిలీ హామీలు ఓటర్లను ఆకర్షించాయి. దీనితో వైసీపీ 151 సీట్లతో భారీ విజయం సాధించింది. 2019-24 మధ్య కేవలం సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చి, ఉపాధి అవకాశాలు, రాజధాని నిర్మాణం, పరిశ్రమల స్థాపన వంటి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే అసంతృప్తి ప్రజల్లో పెరిగింది. ఫలితంగా, సంక్షేమంతో పాటు "సూపర్ సిక్స్" హామీలు మరియు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తామని ప్రకటించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఓటర్లు 164 స్థానాలతో చారిత్రాత్మక విజయాన్ని అందించారు. అంటే అభివృద్ధి, సంక్షేమమే ప్రజలు కోరుకోవడం లేదని, మార్పు కోరుకుంటున్నారని గత ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతున్నాయి. కూటమి ప్రభుత్వ వ్యూహమిదే...ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా పేర్కొంటూ పాలిస్తోంది. అభివృద్ధి పరంగా: అమరావతి రాజధాని పనులను వేగవంతం చేయడం, పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం, గూగుల్, అదానీ, రిలయన్స్ వంటి సంస్థల ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంక్షేమం పరంగా: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, సామాజిక పింఛన్ల పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ అమలు చేస్తోంది. భవిష్యత్తులో అధికారాన్ని నిర్ణయించే ఇతర కీలక అంశాలుఅభివృద్ధి, సంక్షేమం ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, మళ్లీ అధికారం దక్కించుకోవడానికి ఇవి మాత్రమే సరిపోవు. ఇతర రాజకీయ సమీకరణాలు కూడా అంతే ముఖ్యంయువత , మధ్యతరగతి ఆకాంక్షలు...సంక్షేమ పథకాలు పేద వర్గాలకు మేలు చేసినప్పటికీ, యువత మరియు పట్టణ మధ్య తరగతి ఓటర్లు ఉద్యోగాలు, మౌలిక వసతులు మరియు ఆర్థిక వృద్ధిని ఎక్కువగా కోరుకుంటా రు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు అభ్యర్థుల గెలుపోటములను ఎల్లప్పు డూ బలంగా ప్రభావితం చేస్తాయి.ఇచ్చిన సంక్షేమ హామీలను నెరవేరుస్తూనే, రాష్ట్ర అప్పులను నియంత్రించి ఆర్థిక సమతుల్యతను ఎలా కాపాడుకుంటారనే దానిపై ప్రభుత్వ పట్ల ప్రజల్లో విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్రస్తుతం చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. కేవలం సంక్షేమ పథకాలే ఉంటే సరిపోదు, రాష్ట్ర భవిష్యత్తుకు అభివృద్ధి కూడా అంతే అవసరమని నమ్ముతున్నారు. కాబట్టి, ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తూనే, ఉపాధి-ఆర్థిక వృద్ధిని సాధించగలిగితేనే ప్రజలు తిరిగి అధికారాన్ని కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గంటా శ్రీనివాసరావు చెప్పనట్లు నేతలు ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని, తాము ఉన్నామన్న భరోసా వ్యక్తిగతంగా ఇవ్వగలిగితేనే గెలుపు సాధ్యమయిందన్న ఆయన అభిప్రాయంలో నిజముందని చెప్పకతప్పదు.

