ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్ననున్నారు.
ప్రధానంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో తమ పార్టీకి చెందిన ఓట్లకు తొలగించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై...
మరొకవైపు ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ లు హాజరయ్యారు. పీసీసీ ఎంపిక చేసిన 60 మందికి మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముగింపు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

