తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటేజీల విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పదిహేను మందితో కమిటీ వేయాలని నిర్ణయించింది.
పర్సంటేజీల విధానంప రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సమస్యపై సి. కల్యాణ్ మాట్లాడారు. రెండు నెలల్లో సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.
కమిటీలో...సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని సి. కల్యాణ్ అన్నారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో ఫిల్మ్చాంబర్ అధ్యక్షుడు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై చర్చ జరగుతుంది.

