Dailyhunt
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే

TeluguPost.com 4 days ago

టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అమరావతిలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి మరిన్ని నిధుల కేటాయించాలని టీటీడీ పాలక మండలి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగులకు...టీటీడీ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీపధూప నైవేద్యం క్రింద ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంపుదల నిర్ణయానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈమేరకు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వివరాలను మీడియాకు వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu