Telangana : తెలంగాణలో రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ మార్కెట్ల డిజిటలీకరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
206 మార్కెట్ కమిటీలను పూర్తిగా ఆటోమేషన్ చేయాలని నిర్ణయించారు. ఇకపై పూర్తి డిజిటల్ విధానంలోనే మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లుచేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
స్కానింగ్ వ్యవస్థను...రైతులు ఇబ్బందులు పడకుండా అవసమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మార్కెట్ యార్డుల్లో నంబర్ప్లేట్ స్కానింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొనుగోళ్లలో ఆలస్యం లేకుండా చూడాలని మంత్రి తుమ్మల కోరారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని తుమ్మల తెలిపారు.

