కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ఎంపిక పట్ల కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పందించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. హైకమాండ్ ఎంపిక చేసిందంటే అది ఖచ్చితమైన నిర్ణయమే అయి ఉంటుందని కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
తాను అసంతృప్తిగా లేనని కూడా కేసీ వేణుగోపాల్ అన్నారు.
సరైన నిర్ణయమే...వీడీ సతీశన్ పార్టీ విజయానికి కృషి చేశారన్న కేసీ వేణుగోపాల్ సతీశన్ ఎంపిక సరైనదేనని అన్నారు. కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపాలని ఆయన ఆకాంక్షించారు. తన సహకారం వీడీ సతీశన్ కు ఎప్పుడూ ఉంటుందని కేసీ వేణుగోపాల్ చెప్పారు

