Kolkata : పశ్చిమ బెంగాల్ లో కాల్పులు కలకలం జరిగింది. కోల్ కతాలోని మాల్దా బీఎస్ఎఫ్ క్యాంపులో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
తోటి జవాన్లపై విచక్షణారహితంగా మరో బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు జరిపినట్లు తెలిపారు.
మాల్దా బీఎస్ఎఫ్ క్యాంపులో...కాల్పులు జరిగిన ఘటన సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు బీఎస్ఎప్ క్యాంప్ నకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో మరో జవాన్కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన జవాను శివమ్ మిశ్రాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

