Hyderabad : యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ లో ఉంటున్న నందన దంపతులు ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారని కేసులు నమోదయ్యాయి.
దీంతో ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు లో నందనను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ కు చేరుకున్న...విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో నందన దంపతులపై కేసు నమోదు చేసింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న నందనను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఇబ్రహీం పట్నం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.

