వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు.. వైసీపీ నేతల మీద తీవ్రమైన దూషణలు.. టీడీపీకి ఇదే నిత్యకృత్యమైపోయింది. వైసీపీ పుట్టాక, టీడీపీ నుంచి తీవ్రమైన రాజకీయ దాడిని ఎదుర్కొన్నా, తట్టుకుని గట్టిగా నిలబడింది. మరి, అందుకు బదులు తీర్చుకోవదద్దా.? అన్నది వైసీపీ వాదన. సరే, రాజకీయాల్లో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలేనా.? అభివృద్ధి ఆలోచన ఏమీ లేదా.? అంటే, అది వేరే చర్చ. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, గడచిన రెండేళ్ళుగా చేస్తున్న రాజకీయాలతో, టీడీపీ నానాటికీ అత్యంత దారుణంగా తయారవుతోంది. టీడీపీ తరఫున మీడియా ముందుకొస్తున్నవారెవరూ బాధ్యత గల రాజకీయ నాయకుల్లా మాట్లాడటంలేదు.
టీడీపీకి 2019 ఎన్నికల్లో జనం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే కట్టబెట్టారు.

