Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
49 బంతుల్లో 100 నాటౌట్.. విరుచుకుపడ్డ షెఫాలీ.. బంగ్లాదేశ్ టార్గెట్ 196!

49 బంతుల్లో 100 నాటౌట్.. విరుచుకుపడ్డ షెఫాలీ.. బంగ్లాదేశ్ టార్గెట్ 196!

Telugu Samayam 11 hrs ago

షియన్ గేమ్స్ 2026 ఉమెన్స్ క్రికెట్ రెండో సెమీఫైనల్‌లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ సెంచరీతో సత్తాచాటడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..

నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 195/4 పరుగులు స్కోరు చేసింది. షెఫాలీ వర్మ.. అజేయ సెంచరీతో కదం తొక్కింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. స్మృతి మంధాన కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు పవర్ ప్లే ముగిసేసరికి (5.6 ఓవర్లలో) 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

స్మృతి ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా బ్యాట్‌తో సత్తా చాటింది. 33 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేసి షెఫాలీకి చక్కని సహకారం అందించింది. మూడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 55 బంతుల్లోనే 94 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ రికార్డు స్కోరు దిశగా పయనించింది. ముఖ్యంగా షెఫాలీ వర్మ.. బంగ్లాదేశ్ బౌలర్లను ఏమాత్రం కనికరం లేకుండా బాదింది. కేవలం 49 బంతుల్లోనే 3 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో సెంచరీ (100 నాటౌట్) మార్కును అందుకుంది. 204.08 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడిన ఆమె ఇన్నింగ్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లోనే హైలైట్‌గా నిలిచింది. అజేయ సెంచరీతో టీమిండియా భారీ స్కోరు సాధించడంలో షెఫాలీ వర్మ ముఖ్య పాత్ర పోషించింది.

భారత బ్యాటర్ల విధ్వంసంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మారూఫా అక్తర్ (1/43), నహిదా అక్తర్ (1/48), సంజిదా అక్తర్ (1/25), రాబెయా ఖాన్ (1/35) చెరో వికెట్ పడగొట్టారు. ఫైనల్ చేరి గోల్డ్ మెడల్ రేసులో నిలవాలంటే బంగ్లాదేశ్ ఇప్పుడు 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam