US Crash Tarsem Singh Charged: అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఒక లగ్జరీ కారు మితిమీరిన వేగంతో దూసుకెళ్లి ప్రమాదానికి గురైన ఘటనలో 17 ఏళ్ల గర్భిణీ టీనేజర్, ఆమె గర్భంలోని శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదానికి కారణమైన, కారును నడిపిన మృతురాలి భర్త, 33 ఏళ్ల భారతీయ పౌరుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నాడని తెలుసుకున్న బాధితురాలి కుటుంబం.. అతడిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.
హైస్పీడ్ ఛేజ్.. గాల్లో ఎగిరిపడ్డ టీనేజర్
నిందితుడు తర్సేమ్ సింగ్.. మరణించిన అష్లీ హోమ్స్ గత కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నారని, ఆమె గర్భంలోని బిడ్డకు అతడే తండ్రి అని బాధితురాలి కుటుంబ సభ్యులు న్యూస్వీక్ పత్రికకు వెల్లడించారు. అష్లీ పలుమార్లు ఆ బంధం నుంచి బయటకు రావాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని వారు వాపోయారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అందించిన సమాచారం ప్రకారం.. తర్సేమ్ సింగ్ 2017 ఫిబ్రవరిలో కాలిఫోర్నియా దక్షిణ సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు. అప్పట్లో అతడిని అరెస్ట్ చేసినప్పటికీ.. కోర్టు ఆదేశాల ప్రకారం బెయిల్పై విడుదల అయ్యాడు. అప్పటి నుంచి అతడు అమెరికాలో అక్రమ వలసదారుడిగానే జీవిస్తున్నాడు.
ఇదీ చూడండి: అమెరికాలో భారత సంతతి మిలియనీర్ అరెస్ట్.. వైన్ తయారీ కేంద్రాన్ని తగులబెట్టేందుకు యత్నించడమే కారణం
ఇమ్మిగ్రేషన్ అధికారులకు బాధితురాలి విజ్ఞప్తి..
ఇదీ చూడండి: అమెరికాలో భారత సంతతి దంపతుల అరెస్ట్.. మోటల్ మాటున ఆ పనులు చేయడం వల్లే..!
ప్రస్తుతం తర్సేమ్ సింగ్పై నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మరణానికి కారణం కావడం, వెహిక్యులర్ హోమిసైడ్ వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. కోర్టు అతనికి ఒక మిలియన్ డాలర్ల భారీ బెయిల్ మొత్తాన్ని విధించింది. ఐసిఈ అధికారులు ఇప్పటికే అతనికి వ్యతిరేకంగా డిటైనర్ జారీ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న తర్సేమ్కు ఆగస్టు 17 నుంచి 21వ తేదీ వరకు కోర్టు విచారణ జరగనుంది. క్రిమినల్ కేసు ముగిసిన వెంటనే అతడిని దేశం నుండి బహిష్కరించే ప్రక్రియ ప్రారంభం కానుంది.

