Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో చూపిస్తూ.. మ్యాప్ విడుదల చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్

జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో చూపిస్తూ.. మ్యాప్ విడుదల చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్

Telugu Samayam 3 weeks ago

Nepal Airlines Map Controversy India: నేపాల్ జాతీయ విమానయాన సంస్థ నేపాల్ ఎయిర్‌లైన్స్ చేసిన ఒక భారీ పొరపాటు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

భారత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిస్తూ తన నెట్‌వర్క్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది. భారత నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన ఆగ్రహం, దౌత్యపరమైన ఒత్తిడితో.. సదరు సంస్థ వెంటనే భారత్‌కు క్షమాపణలు చెప్పింది.

అసలేం జరిగిందంటే..?

బుధవారం నేపాల్ ఎయిర్‌లైన్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తన విమాన సర్వీసుల నెట్‌వర్క్‌ను వివరించే మ్యాప్‌ను షేర్ చేసిది. అయితే ఈ మ్యాప్‌లో భారత కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను పాకిస్థాన్ భూభాగంలో కలిపేసి చూపించారు. ఇలా వివాదాస్పదంగా ఉండడంతో.. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇది చూసిన భారతీయులు అంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

బాయ్‌కాట్ నేపాల్ ఎయిర్‌లైన్స్..

ఈ మ్యాప్ బయటకు రాగానే భారత నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ వేదికగా బాయ్‌కాట్ నేపాల్ ఎయిర్‌లైన్స్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. భోజ్‌పురి నటుడు, గాయకుడు ఖేసరిలాల్ యాదవ్ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది పొరపాటున జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకే ఇలాంటి పోస్టులు పెట్టారని ఆయన ట్వీట్ చేశారు. భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని నేపాల్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

మ్యాప్‌ను తొలగించి.. క్షమాపణలు చెప్పిన సంస్థ

వివాదం ముదురుతున్నట్లు గమనించిన నేపాల్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. వివాదాస్పదంగా మారిన ఆ తప్పుడు మ్యాప్‌ను తన సోషల్ మీడియా పేజీల నుంచి వెంటనే తొలగించింది. అలాగే అంతర్జాతీయ సరిహద్దుల ప్రదర్శనలో పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ.. భారత ప్రభుత్వానికి, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. అయితే ఈ తప్పిదం ఎలా జరిగిందనే అంశంపై అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.


ప్రస్తుతానికి భారత విదేశాంగ శాఖ ఈ అంశంపై అధికారికంగా స్పందించనప్పటికీ.. పొరుగు దేశాల విమానయాన సంస్థలు భారత మ్యాప్ విషయంలో ఇలాంటి అజాగ్రత్తలు వహించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది సాంకేతిక లోపమా లేక వ్యూహాత్మక తప్పిదమా అనే కోణంలో చర్చ జరుగుతోంది. మరి దీన్ని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam