11 Ebola Patients Escape: ఆఫ్రికా ఖండంలో అత్యంత ప్రమాదకరంగా మారిన ఎబోలా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. కాంగో దేశంలో ఈ మహమ్మారి తీవ్రత మరింత ఆందోళనకరంగా మారగా..
అంతా హడలిపోతున్నారు. ముఖ్యంగా ఓవైపు వైరస్ శరవేగంగా విస్తరిస్తుండగా.. మరోవైపు ఐసోలేషన్ కేంద్రాల నుంచి బాధితులు పారిపోవడం, సహాయక బృందాలపై దాడులు జరగడం వంటి ఘోర పరిణామాలు అక్కడి పరిస్థితులను మరింత దిగజార్చుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు సైతం అప్రమత్తమై నిఘాను తీవ్రం చేశాయి.
అంత్యక్రియల బృందంపై దాడి.. రోగుల పరార్!
ఈ గందరగోళం ఇలా ఉండగానే.. ఇటూరి ప్రావిన్స్లోని ఎబోలా ప్రత్యేక చికిత్సా కేంద్రాల నుంచి 11 మంది రోగులు అధికారుల కళ్లు గప్పి పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. సాయుధ మూకలు కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ వైద్యులు, మానవతా స్వచ్ఛంద సంస్థల సేవలపై ఆంక్షలు విధిస్తూ ఆటంకాలు కలిగిస్తుండటంతో క్షేత్రస్థాయిలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తీవ్రరూపం దాల్చుతున్న మరణాల సంఖ్య..
ప్రపంచ దేశాల హై అలర్ట్..!

