Jangaon Retired Teacher Suicide: జనగామ జిల్లా కేంద్రంలో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా "నా మరణానికి తెలంగాణ ప్రభుత్వం, నా బావమరిదే కారణం" అని పేర్కొంటూ ఏకంగా 20 పేజీల సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తనకు రావాల్సిన పదవీ విరమణ ఆర్థిక ప్రయోజనాలను అందించకుండా ప్రభుత్వం జాప్యం చేయడం, అదే సమయంలో నమ్మిన బంధువులే డబ్బులు ఎగ్గొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో జిల్లావ్యాప్తంగా సంచలనం రేగుతోంది.
ఆర్థిక ఇబ్బందులు.. బంధువుల మోసం..
జీపీఎఫ్ ఇవ్వని ప్రభుత్వం.. లేఖలో హైకోర్టు జడ్జి ప్రస్తావన!
కేసు నమోదు చేసిన పోలీసులు..
ఘటనపై సమాచారం అందుకున్న జనగామ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మల్లయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన 20 పేజీల సుదీర్ఘ ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా బావమరిది, ఇతర బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
