BJP Saffron Map India Viral: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ..
బీజేపీ బెంగాల్ గడ్డపై అఖండ విజయాన్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఈక్రమంలోనే ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వేదికగా సరికొత్త ఇండియా మ్యాప్ను విడుదల చేసింది. అందులో పశ్చిమ బెంగాల్ కూడా కాషాయమయమైందని చెబుతూ చేసిన పోస్్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆపూర్తి వివరాలు మీకోసం.
కాషాయమయమైన భారత దేశ పటం..!
వికసిత్ భారత్ దిశగా మరో అడుగు..
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించడం అసాధ్యమని భావించిన విశ్లేషకులకు ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి. బీజేపీ పంచుకున్న మ్యాప్ ప్రకారం.. ఉత్తర, పశ్చిమ, మధ్య భారత్తో పాటు ఇప్పుడు తూర్పు భారత్లో కూడా బీజేపీ తన జెండాను పాతగలిగింది. ముఖ్యంగా బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రం కమలం ఖాతాలో పడటంతో.. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు బీజేపీ ఒక బలమైన హెచ్చరిక పంపినట్లయింది.

