Lalit Modi IPL Allegations: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన 2010 నాటి 'కొచ్చి టస్కర్స్ కేరళ' ఫ్రాంచైజీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ.. అప్పటి యూపీఏ ప్రభుత్వంపై, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలపై సంచలన ఆరోపణలు చేశారు. కొచ్చి జట్టు యాజమాన్య నిర్మాణం, సునంద పుష్కర్ పాత్రపై తాను ప్రశ్నలు లేవనెత్తినప్పుడు.. అప్పటి ప్రభుత్వం తనపై తీవ్ర రాజకీయ ఒత్తిడి తీసుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఆనాటి తెరవెనుక రాజకీయాలను బయటపెట్టారు.
రూ. 10ల షేర్.. రూ. 1 లక్ష ఎలా అయింది?
సోనియా గాంధీ అండతో శశి థరూర్ బెదిరించారంటూ!
బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో వాటాదారులందరి అసలు గుర్తింపు తెలిసే వరకు తాను ఫ్రాంచైజీ ఒప్పందంపై సంతకం చేయనని తిరస్కరించినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అప్పటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్ తనకు ఫోన్ చేశారని లలిత్ మోదీ ఆరోపించారు. "శశి థరూర్ నాకు ఫోన్ చేసి.. లలిత్.. సునంద పుష్కర్ గురించి ఎక్కువగా ప్రశ్నించకు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఒకవేళ నువ్వు వినకుంటే రేపు ఉదయమే నీపై ఐటీ దాడులు చేయిస్తాను' అని బెదిరించారు. దానికి నేను భయపడకుండా.. నువ్వు విదేశాంగ మంత్రివి కావచ్చు. కానీ నన్ను బెదిరించొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశాను" అని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒత్తిడితో సంతకం.. ట్విట్టర్ సంభాషణలు
ఐపీఎల్ క్రికెట్ చరిత్రను శాసించిన అత్యంత వివాదాస్పద 'కొచ్చి టస్కర్స్' వ్యవహారం దశాబ్దం తర్వాత మళ్లీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2010 నాటి ఈ ఉదంతంలో జట్టు వాటాదారుల అక్రమ ఒప్పందాలు, సునంద పుష్కర్ పాత్రను తాను ప్రశ్నించినందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం తనను ఎలా టార్గెట్ చేసిందో ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ సంచలన నిజాలను బయటపెట్టారు. శశి థరూర్ వెనుక సోనియా గాంధీ ఉండి నడిపించారంటూ.. తనను ఐటీ దాడులతో బెదిరించారంటూ సంచలన షాకింగ్ కామెంట్లు చేశారు.

