IPS Arun Bothra Warning: విదేశీ పర్యటనల్లో కొందరు భారతీయ పర్యాటకులు ప్రవర్తిస్తున్న తీరు, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతినడంపై సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
విదేశాల్లో భారతీయుల అనుచిత ప్రవర్తన కారణంగా భవిష్యత్తులో భారతీయ పౌరులందరికీ వీసా నిబంధనలు మరింత కఠినమయ్యే ప్రమాదం ఉందంటూ ఒడిశాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్న అభిప్రాయాలు ఇంటర్నెట్ యూజర్లలో పెద్ద చర్చకు దారితీశాయి.
పాస్పోర్ట్ అనేది కేవలం హక్కు కాదు ఒక బాధ్యతంటూ..!
రీల్స్ పిచ్చి.. కఠినమౌతున్న వీసా నిబంధనలు..
నెటిజన్లలో మిశ్రమ స్పందన..!
ఐపీఎస్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. అరుణ్ బోత్రా వ్యాఖ్యలను సమర్థిస్తూ ఒక యూజర్.. తాము బ్యాంకాక్ వెళ్లినప్పుడు కొందరు భారతీయులు అర్ధరాత్రి పూట మద్యం తాగి గొడవ చేయడం, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పక్కవారి ప్రశాంతతను పాడుచేయడం వంటివి చూశామని రాసుకొచ్చారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. దశాబ్దం క్రితం భారతీయుల డ్రైవింగ్ లైసెన్సులు, విద్యా అర్హతలను విదేశాలు ఎంతగానో నమ్మేవని, కానీ ఇప్పుడు కొందరి ప్రవర్తన వల్ల ఆ నమ్మకం సడలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ వ్యాఖ్యలతో కొందరు విభేదించారు. వీసా నిబంధనలు కేవలం భారతీయులకే కాదు, అన్ని దేశాల వారికి మారుతుంటాయని ఒక యూజర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ దేశమైనా పర్యాటకుల సివిక్ సెన్స్ను కాకుండా.. వారి బ్యాంక్ బ్యాలెన్స్, ఉద్యోగ ఆధారాలను మాత్రమే చూస్తుందని, కాబట్టి ఇలాంటి కొన్ని సంఘటనలను బట్టి అందరినీ అంచనా వేయలేమని వాదించారు. మరి ఐపీఎస్ అధికారి చేసిన కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

