Dailyhunt
కేసీఆర్ తో ట్రంప్ ఏం మాట్లాడాడో..?

కేసీఆర్ తో ట్రంప్ ఏం మాట్లాడాడో..?

రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ దంపతులు ఇండియా కు వచ్చిన సంగతి తెలిసిందే. పర్యటన లో భాగంగా ఈరోజు భారత రాష్ట్రపతి ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ విందుకు రాష్ట్రపతి భవన్ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు పిలుపు వచ్చింది. కేసీఆర్ తో పాటు తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ సీఎం కేసీఆర్ తో ముచ్చటించారు. మరి కేసీఆర్ తో ఏం మాట్లాడారో మరి.

డొనాల్డ్‌ ట్రంప్‌..

ఆయన కుటుంబ సభ్యులు, అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోది, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తదితర ప్రముఖులంతా వారికి వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ట్రంప్‌ కుటుంబ సభ్యులు కారులో నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో సిద్దంగా ఉన్న అమెరికా ప్రెసిడెంట్‌ అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌-1లో వారు ఇండియా నుంచి అమెరికాకు బయల్దేరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi