మహర్షి తో సూపర్ హిట్ అందించిన వంశీ కి మరోసారి ఛాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు. తన 27 వ చిత్రాన్ని వంశీ చేతిలో పెట్టాడు. అతి త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని అంత అనుకుంటున్నా సమయం లో మహేష్ వంశీ కి షాక్ ఇచ్చాడు. స్క్రిప్ట్ లో లోపాలు ఉండడం తో ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ , పరుశురాం వంటి డైరెక్టర్స్ కథలు వినిపించారని వార్తలు వినిపిస్తున్న.మహేష్ మాత్రం కమర్షియల్ కథల కోసం ఎదురుచూస్తున్నాడట.
కమర్షియల్ కథ చెప్పి మెప్పించగలిగిన దర్శకుడికే అవకాశం ఇస్తారట. ఇటీవలే మహేష్ ఇకపై తాను పక్కా కమర్షియల్ ఫార్మాట్లోనే చిత్రాలు చేస్తానని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు. పైగా గతంలో సందీప్ వంగ, సుకుమార్ లాంటి దర్శకులు చెప్పిన కథల్లో పూర్తిస్థాయి కమర్షియాలిటీ లేకపోవడం మూలంగానే మహేష్ వారితో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు అంటున్నారు.

