అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై విదేశీ మీడియా పెదవి విరిచింది.ట్రంప్ పర్యటనను పీఆర్ వ్యవహారంగా మార్చేశారని, ట్రంప్ పర్యటనను ప్రజాకర్షకంగా మలచడానికి భారత్ ప్రయత్నించిందని న్యూయార్క్ టైమ్స్ విమర్శించింది.
ట్రంప్ భారత పర్యటన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు బాగా పనికొస్తుందని బీబీసీ విమర్శించింది. ఇండియాలో ఆయన పర్యటన సందర్భంగా హాజరైన జనం విజువల్స్ను ట్రంప్ వినియోగించుకుంటారని , ఇవి చూపించి విదేశాల్లో తనకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో చెప్పుకుంటారని రాసుకొచ్చింది. పెద్ద ఒప్పందాలేవీ లేకుండానే ట్రంప్ భారత పర్యటన ముగిసిందని, హౌడీ మోదీ సభకు ప్రతిస్పందనే నమస్తే ట్రంప్ సభ అని పాక్ పత్రిక డాన్ పేర్కొంది.

