Anna Lezhneva : పవన్ కళ్యాణ్ - అన్నా లెజినోవా తనయుడు మార్క్ శంకర్ కి సంవత్సరం క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 8) సింగపూర్ లో తను చదువుకుంటున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగి గాయపడ్డాడు.
దాంతో ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్ లో కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు. తాజాగా ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ పవన్ భార్య అన్నా లెజినోవా తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.
అప్పటి సంఘటనలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఈ రోజు మా కుటుంబానికి చాలా భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు అకిరా పుట్టినరోజు. అతన్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాం. అతను చాలా లోతుగా ఆలోచిస్తాడు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవాడు, ఎంతో దయగలవాడు. అంతేకాకుండా మార్క్ ప్రాణాలు దాదాపు కోల్పోయినంత పరిస్థితికి కారణం అయిన ఆ అగ్నిప్రమాదం జరిగి సరిగ్గా ఒక సంవత్సరం అయింది.
ఈ రోజు మేం మా ఇద్దరు అబ్బాయిల పుట్టినరోజును జరుపుకుంటున్నాం. కానీ మార్క్కు మాత్రం ఇది తన రెండవ పుట్టినరోజులా అనిపిస్తోంది. ఒక సంవత్సరం గడిచినా ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. ఆ ఘటన వల్ల మరణించిన పిల్లల మరణానికి ఎవరు బాధ్యులో మాకు ఇప్పటికీ తెలియదు. కొంతమంది పిల్లలకు ఇంకా శస్త్రచికిత్సలు అవసరం. వారి కాలిన గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. దేవుడి దయవల్ల మార్క్ బ్రతికాడు. అతని ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, కానీ ఈ రోజు అతను బాగున్నాడు. అతనే మాకు సర్వస్వం. అతని ఆసుపత్రి మంచం పక్కన కూర్చుని అతను ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటాన్ని చూసిన దృశ్యం నాకు ఇంకా గుర్తుంది. ఏ తల్లి కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కోకూడదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు 15 మంది పిల్లల ప్రాణాలను కాపాడిన ఆ ధైర్యవంతులైన నిర్మాణ కార్మికులకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను. దయచేసి సురక్షితంగా ఉండండి. మీ ఇంట్లో అగ్నిమాపక పరికరం లేదా అగ్ని నిరోధక దుప్పటిని ఉంచుకోండి. మీరు దానిని ఎప్పటికీ ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

