Telangana Workers Wages: కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో మీడియా సమావేశంలో కార్మికుల కనీస వేతనాల పెంపుపై కీలక విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.
కార్మికులను 3 జోన్లలో 4 కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచారు. జోన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్లలోని కార్మికులు ఉన్నారు. జోన్ లో మున్సిపాలిటీల్లోని పరిశ్రమల కార్మికులు, జోన్ 3లో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల కార్మికులు ఉన్నారు. అన్ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 16వేల రూపాయలకు పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 17వేల రూపాయలకు పెంచారు. స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 18వేల 500 రూపాయలకు పెంచారు. హైస్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.20వేలకు పెంపు చేశారు. వేతనాల పెంపుతో కోటి 11 లక్షల మంది కార్మికులకు లబ్ది కలగనుంది. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

