Dailyhunt
జగన్ 'మావిగన్' టీడీపీలో వణుకు పుట్టిస్తోందా..

జగన్ 'మావిగన్' టీడీపీలో వణుకు పుట్టిస్తోందా..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌ (MAVIGAN) గ్రోత్ కారిడార్ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

ఈ ప్రతిపాదనతో అధికార తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణంపై విమర్శలు గుప్పిస్తూనే, జగన్ సూచించిన నూతన అభివృద్ధి నమూనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి అంటే కేవలం రోడ్లు మాత్రమేనా?అమరావతి రాజధాని అసలు ఎప్పుడు పూర్తవుతుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమరావతిలో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా కేవలం రోడ్లు తప్ప అక్కడ నగరం ఏర్పడదు అని ఆయన ఎద్దేవా చేశారు. ఒకే చోట అంత భారీ మొత్తాన్ని కుమ్మరించడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందన్నది వారి వాదన. కేవలం గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.ఏమిటీ మావిగన్ (MAVIGAN)?జగన్ ప్రతిపాదించిన మావిగన్ (MAVIGAN) అనేది ప్రధాన నగరాలైన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి (నరసరావుపేట/నందిగామ కలిపి) ప్రాంతాలను అనుసంధానిస్తూ రూపొందించే ఒక భారీ గ్రోత్ కారిడార్. ఈ ప్రతిపాదనపై ప్రజలు కూడా ఇప్పుడు సీరియస్‌గా ఆలోచన చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. కేవలం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, ఈ నాలుగు ప్రధాన పట్టణాలను కలుపుతూ అభివృద్ధిని విస్తరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వైఎస్సార్‌సీపీ వాదిస్తోంది. టీడీపీపై విమర్శల అస్త్రాలుజగన్ ప్రతిపాదనతో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైందని, అందుకే వారు అమరావతి చట్టబద్ధత వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని అంబటి ఆరోపించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జగన్ ఆలోచనా విధానమే సరైనదని, కేవలం ఒక కులానికి లేదా ఒక వర్గానికి చెందిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అభివృద్ధి అనిపించుకోదని ఆయన వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh