Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆగని ఆందోళన

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆగని ఆందోళన

తెలంగాణలో రైతుల ఆందోళన ఆగడం లేదు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. పలు చోట్ల ధర్నాలు చేస్తూ రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ధాన్యానికి నిప్పు పెట్టారు.

నల్గొండ , యాదాద్రి భువనగిరితో సహా ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లోని రైతులు, వరి సేకరణ , గిడ్డంగులకు రవాణాలో జాప్యానికి నిరసనగా వరి నిల్వలను తగలబెట్టి ఆందోళన చేపట్టారు. సుదీర్ఘ జాప్యం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, వారు తక్షణ సేకరణ సులభతర రవాణాను డిమాండ్ చేశారు.

అధికారులకే బాగా తెలిసిన కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల రోజులుగా వరి సేకరణను ఆలస్యం చేస్తోందని వారు ఆరోపించారు .

ధాన్యాన్ని సర్ఫరా చేయడానికి గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి.

అదేవిధంగా, నల్గొండలోని నక్కలపల్లి గ్రామంలో, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు తమ వరి ధాన్యాన్ని రోడ్డుపై తగలబెట్టి నిరసన చేపట్టారు. స్థానిక మార్కెట్‌లో ప్రభుత్వ అధికారులు కొనుగోలును ఆలస్యం చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు.

ఇది కాకుండా, సేకరించిన సరుకులను గిడ్డంగులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని బి ఆర్ ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. సరుకులను తూకం వేసి, ధృవీకరించినప్పటికీ, ట్రక్కుల కొరతను సాకుగా చూపి అధికారులు రవాణాను ఆలస్యం చేస్తున్నారని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామానికి చెందిన రైతు పాల అశోక్ ఫిర్యాదు చేశారు.పంటను పండించడం ఒక ఎత్తు అయితే కొనుగోలు కేంద్రాలకు తరలించడం మరో ఎత్తు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సరిగ్గా నెల రోజుల క్రితం, కరీంనగర్ జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలోని రాగంపేట గ్రామంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో, 38 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని అమ్మడానికి తన వంతు కోసం ఎదురుచూస్తూ, ఆ ధాన్యం కుప్పపై కూర్చున్న తెలంగాణ రైతు రాజేశం వడదెబ్బకు గురై మరణించారు

రికార్డు స్థాయిలో కొనుగోళ్లు" చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేసి రైతులను తప్పుదారి పట్టిస్తోందని, వాస్తవానికి అంచనా వేసిన 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంటలో 17.28 లక్షల మెట్రిక్ టన్నులను కూడా కొనుగోలు చేయడంలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. "ఇది ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది," అని పౌర సరఫరాల శాఖ లోపాలను ఎత్తి చూపుతున్నాయని మహేశ్వర్ రెడ్డి అన్నారు. నాణ్యమైన వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేశారని, అయితే ధాన్యంలో తేమ ఉందనే అస్పష్టమైన సాకులతో ఆ బోనస్‌ను తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు.తరుగు పేరిట 12 రూపాయలు తగ్గిస్తున్నట్టు ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగుతో బాటు గిడ్డంగుల్లో కూడా తరుగు తీస్తున్నట్టు ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పు దారి పట్టించేవిధంగా వ్యవహరిస్తుందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కొను గోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లో కాంగ్రెస్ ఫ్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది.

మక్కలు కొనుగోలు చేయడంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోవడంతో రైతులు మండే ఎండల్లో వేచి చూస్తున్నారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం మొలకెత్తుతుంది.

రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేయడం లో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మీద నిందలు వేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. తన బాధ్యతను అధికారుల మీదనో , కేంద్రం మీదనో నెట్టివేస్తుందని ఆరోపించారు. గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించి అభాసుపాలయిందని అన్నారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసి పోకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గిడ్డంగులకు తరలించాలని అధికారులకు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA