Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటకలో పట్టుబడ్డ నకిలీ మందులు

కర్ణాటకలో పట్టుబడ్డ నకిలీ మందులు

ర్ణాటకలో దాదాపు నాలుగు కోట్ల విలువైన నకిలీ మందులను ఎఫ్డీఏ దాడుల్లో కనుగొన్నారు. కర్ణాటకలోని బిడదిలోని కురుబరకెరన హళ్లిలో గల ఒక ఫామ్‌హౌస్‌లో నకిలీ మందులకు కేంద్రంగా ఉందనే సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించగా భారీ సంఖ్యలో అవి పట్టుబడ్డాయి.

ఈ కేంద్రం గురించి ఆగస్టు 18న అందిన సమాచారం మేరకు కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖకు చెందిన అధికారుల బృందం ఈ తనిఖీని నిర్వహించిందని వారు చెప్పారు.

అధికారుల ప్రకారం, ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధర గల మందులను సేకరించడానికి ఈ ప్రాంగణాన్ని ఉపయోగిస్తున్నారని, ఆ తర్వాత వాటిని కొత్త సీసాలలో నింపి, ఖరీదైన బహుళజాతి సంస్థల బ్రాండ్లు, దిగుమతి చేసుకున్న మందుల వలె కనిపించేలా రీలేబుల్ చేస్తున్నారని దర్యాప్తులో వెల్లడైంది.కొనుగోలుదారులను మోసం చేసి లాభం సంపాదించాలనే ఉద్దేశ్యంతో, అసలైన, బ్రాండెడ్ ఉత్పత్తుల వలె కనిపించేలా తయారు చేయబడిన నకిలీ లేదా కల్తీ మందులు అని వారు తెలిపారు."ఈ నకిలీ మందులలో క్రియాశీలక ఔషధం లేదు. తప్పుడు పదార్థాలు లేదా హానికరమైన పదార్ధాలు ఉన్నాయి. ఈ ప్రయోజనం కోసం ఉపయోగించిన లేబుళ్లపై ఉన్న స్కానింగ్ కోడ్‌లు పనిచేయలేదు" అని ఆ శాఖ కమిషనర్ శ్రీనివాస్ కె జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ప్రకారం, నకిలీ మందులను సెక్షన్ 17బి కింద పరిగణిస్తారని, నకిలీ మందులను తయారు చేయడం, అమ్మడం, నిల్వ చేయడం లేదా పంపిణీ చేయడం వంటి వాటికి సెక్షన్ 27 కింద కఠినమైన శిక్ష విధిస్తారని అధికారులు తెలిపారు.ఇలాంటి నకిలీ మెడిసిన్ కు కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు ఉంటాయి. స్వాధీనం చేసుకున్న సరుకును బెంగళూరు సౌత్‌లోని స్థానిక కోర్టులో హాజరుపరుస్తామని వారు చెప్పారు. స్వాధీనం చేసుకున్న మందులలో 5,640 సెఫియావిజెంట్ 2.5 ఇంజెక్షన్ వయల్స్, 1,531 హిజ్లామ్ ఇంజెక్టబుల్స్ వయల్స్, 470 క్సావిటాజ్ ఇంజెక్షన్ వయల్స్, 264 ఎంబ్లేవియో వయల్స్‌తో పాటు గడువు ముగిసిన మందులు, ప్యాకేజింగ్ సామగ్రి, ఇంజెక్షన్ నింపే యంత్రాలు, నకిలీ లేబుల్స్ ఉన్నాయి.స్వాధీనం చేసుకున్న సరుకు మొత్తం అంచనా విలువ రూ. 4,91,49,575 అని వారు తెలిపారు. ప్రాథమిక విచారణలో అనేక కీలక నిబంధనలు ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. లైసెన్సు లేకుండా మందుల తయారీ, నిల్వ, పంపిణీకి సంబంధించి ఈ కార్యకలాపం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940ను నేరుగా ఉల్లంఘించిందని వారు పేర్కొన్నారు. "జెనరిక్ లేదా తక్కువ ధర మందులను ప్రీమియం బ్రాండ్లుగా రీ-లేబుల్ చేయడం ద్వారా, నేరస్థులు రోగులకు అందించే మందుల ప్రామాణికత, భద్రతకు సంబంధించి గణనీయమైన ప్రమాదాలను సృష్టించారు" అని వారు తెలిపారు.గడువు ముగిసిన 30 పెట్టెల మందులను స్వాధీనం చేసుకోవడం ద్వారా, అటువంటి మందులు తిరిగి సరఫరా గొలుసులోకి ప్రవేశపెడుతున్నాయని, ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని శాఖ పేర్కొంది.ఈ స్వాధీనాల తరువాత, తదుపరి పంపిణీ లేదా అమ్మకాలను నిరోధించడానికి, స్వాధీనం చేసుకున్న మందుల బ్యాచ్ నంబర్లు, ఎంట్రీలను కర్ణాటక FDA పోర్టల్‌లో నిరోధిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల రసాయన ఫార్మూలాలు కనుగొనడానికి ల్యాబ్ కు పంపారు."తావరకెరె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. దర్యాప్తును పూర్తి చేయడానికి, బాధ్యులపై విచారణ ప్రారంభించడానికి చట్ట అమలు, నియంత్రణ అధికారులు కలిసి పనిచేస్తున్నారు" అని శాఖ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA