మహారాష్ట్ర ప్రభుత్వం ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడింగ్ ఆప్ లను తొలగించాలని కోరుతూ ఆపిల్, గూగుల్ కు నోటీస్ జారీ చేసింది. ఉబెర్, ఓలా, రాపిడో సంస్థలు అనధికారికంగా బైక్ ట్యాక్సీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నోటీసును మహారాష్ట్ర రాష్ట్ర సైబర్ విభాగం జారీ చేసింది.
నోటీసులో ఏముంది?
మే 15న, ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్లకు "యాక్సెస్ను తొలగించి, నిలిపివేయాలని" ఆయా కంపెనీలను ఈ విభాగం కోరింది. మే 12న మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి లేఖ రాసిన తర్వాత ఇది జరిగింది. "కొన్ని యాప్ ఆధారిత ప్లాట్ఫారమ్లు సరైన అనుమతులు, ప్రభుత్వ ఆమోదాలు పొందకుండా, లేదా రవాణా శాఖ నిర్దేశించిన నియమ నిబంధనలు, మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనలను పాటించకుండా బైక్ ట్యాక్సీ కార్యకలాపాల ద్వారా పెద్ద ఎత్తున ప్రయాణీకుల రవాణా సేవలను నిర్వహిస్తున్నట్లు గమనించబడింది" అని ఆ నోటీసులో పేర్కొన్నారు.డ్రైవర్ల ధృవీకరణ యంత్రాంగాలు, బీమా రక్షణలు, మహిళల భద్రతా చర్యలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు చాలా అసంపూర్ణంగా ఉన్నాయని నివేదించబడింది. అంతేకాకుండా, ఇటువంటి బైక్ ట్యాక్సీ కార్యకలాపాలతో సాధారణంగా ముడిపడి ఉన్న నిర్లక్ష్యపు, అజాగ్రత్త డ్రైవింగ్ ప్రజల భద్రతకు గణనీయమైన ప్రమాదాన్ని సృష్టిస్తుంది.ఇటీవల, ఈ అప్లికేషన్లలో ఒకదాని ద్వారా నడపబడుతున్న బైక్ ట్యాక్సీ సర్వీస్ కారణంగా ఒక మహిళ విషాదకరంగా మరణించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయమై ఒక క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి అనేక కేసులు నమోదైనట్లు నివేదించబడింది" అని అది జోడించింది.యాప్లను తొలగించకపోతే ఆపిల్, గూగుల్పై చర్యలు తీసుకుంటామని ఆ నోటీసు హెచ్చరించింది. "మీ సంస్థకు భారత్ భౌతిక ఉనికి వ్యాపారం ఉన్నందున, అది భారతీయ చట్టాల పరిధిలోకి వస్తుంది. భారతీయ చట్ట అమలు సంస్థల ఆదేశాలను పాటించడంలో విఫలమైతే మీపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సకాలంలో చర్యలు తీసుకోవడంలో మీ వైఫల్యం కారణంగా ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా అంతరాయం కలిగించే సంఘటన జరిగితే, మీరే బాధ్యులుగా ఉంటారని ఇందుమూలంగా హెచ్చరిస్తున్నాము" అని ఆ నోటీసు పేర్కొంది.

