తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో పలువురు నేతలకు కీలక బాధ్యతలు దక్కాయి. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు బస్వరాజు శ్రీనివాస్ను నియమించారు. వాషర్మెన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్కు దాసరిరాజు అజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. గీతకార్మికుల కార్పొరేషన్కు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ను నియమించారు. పెరిక సహకార కార్పొరేషన్కు దొంగారి వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్కు సంగా వెంకటరాజం నియామకాలు జరిగాయి.
వాల్మీకి బోయ కార్పొరేషన్కు గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు కార్పొరేషన్కు బొమ్మ శ్రీరామ్ నియమితులయ్యారు. యాదవ కార్పొరేషన్కు ఎం. రఘునాథ్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. వడ్డెర కార్పొరేషన్కు గుంజ రేణుక నారాయణను నియమించారు. చేనేత అభివృద్ధి కార్పొరేషన్కు దూదెం వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్కు బండి రమేష్ నియామకాలు జరిగాయి.
పద్మశాలి కార్పొరేషన్కు గూడురు శ్రీనివాస్, భట్టరాజ ఫెడరేషన్కు సీహెచ్ బాలరాజు బాధ్యతలు అప్పగించారు. వెలమ కార్పొరేషన్కు జువ్వాది నర్సింగ్ రావు నియమితులయ్యారు. గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్కు కొల్లె సరిత, లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చరణ్ కౌశిక్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణ తెలుగు అకాడమీ ఛైర్మన్గా ప్రొఫెసర్ వెంకటనారాయణను నియమించారు. గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ ఛైర్మన్గా సూదిని రామిరెడ్డి నియామకం జరిగింది. సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్ ఎంపికయ్యారు. ఈ నియామకాలతో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించే నాయకులు తమ తమ రంగాల్లో పనులు ముందుకు తీసుకెళ్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

