Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Atchannaidu : అచ్చన్నాయుడు NO.1 మంత్రి..!

Atchannaidu : అచ్చన్నాయుడు NO.1 మంత్రి..!

TheTeluguNews 14 hrs ago

Atchannaidu : ఏపీ కూటమి ప్రభుత్వంలో పరిపాలన వేగం, ఫైళ్ల క్లియరెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కఠినంగా ఫోకస్ పెట్టారు. తాజాగా జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, కార్యదర్శులు, కలెక్టర్ల ఈ-ఫైల్ క్లియరెన్స్ పనితీరును సమీక్షించారు.

వేగంగా, సమర్థవంతంగా పనిచేసిన వారిని అభినందించగా, ఆలస్యం చేస్తున్న వారు తమ పనితీరు మార్చుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలవడం ప్రత్యేకంగా నిలిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాఖల పనితీరును తరచూ సమీక్షిస్తూ, ఫలితాల ఆధారంగా ర్యాంకులు వెల్లడించే విధానాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. బాగా పనిచేసిన వారిని బహిరంగంగా మెచ్చుకోవడం, వెనుకబడిన వారికి లక్ష్యాలు నిర్దేశించడం ద్వారా పరిపాలనలో జవాబుదారీతనం పెంచాలన్నది ఆయన ఉద్దేశంగా సమావేశంలో కనిపించింది. తన కార్యాలయ పనితీరును కూడా అదే ప్రమాణాలతో పరిశీలించాల్సిందేనన్న సంకేతం ఇచ్చారు.

Atchannaidu : అచ్చన్నాయుడు NO.1 మంత్రి..!

Atchannaidu ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో అచ్చెన్నాయుడికి మళ్లీ అగ్రస్థానం

ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇస్తున్న అచ్చెన్నాయుడిని చంద్రబాబు సమావేశంలో ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గించేందుకు ఈ-ఫైలింగ్ వ్యవస్థను సమర్థంగా ఉపయోగిస్తూ, నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిశీలించి పరిష్కరించే విధానం ఆయన పనితీరుకు ప్రత్యేకత తీసుకొచ్చిందని అభినందించారు.ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో వరుసగా మూడోసారి మొదటి స్థానం సాధించడం అచ్చెన్నాయుడు పనితీరుకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన కొనసాగిస్తున్న వేగం, పారదర్శకత ఇతర శాఖలకు కూడా ఆదర్శంగా ఉండాలని సూచించారు.మరోవైపు రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ వద్ద ఫైళ్ల క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం పడుతోందని చంద్రబాబు ప్రస్తావించారు. తాను కూడా కొన్ని ఫైళ్లను క్లియర్ చేయడానికి నాలుగు రోజుల వరకు సమయం తీసుకుంటున్నానని చెప్పడం గమనార్హం. హోంమంత్రి అనిత సహా ప్రతి ఒక్కరూ నిర్ణయాల వేగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.ప్రభుత్వంలో ఒక ఫైల్ కదలికకు పట్టే ప్రతి రోజు పాలనపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారులు వేగంగా స్పందించి ప్రజలకు, ప్రభుత్వానికి స్పష్టమైన ఫలితాలు అందేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

నెల రోజుల్లో పూర్తిగా ఆన్‌లైన్.. మాన్యువల్ ఫైళ్లపై చంద్రబాబు హెచ్చరిక

పాలన వేగంగా సాగాలంటే ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యం ఉండకూడదని చంద్రబాబు తేల్చిచెప్పారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లు తమ వద్దకు వచ్చిన ఫైళ్లను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని సూచించారు. రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను పరిష్కరించిన అధికారులను అభినందించగా, గంటల్లోనే క్లియర్ చేసిన వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.సకాలంలో ఫైళ్లను క్లియర్ చేయకుండా ఆలస్యం చేస్తున్న అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల నిర్వహణ ఆన్‌లైన్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఇందుకు నెల రోజుల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత కూడా మాన్యువల్ ఫైళ్లు నడిపితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

మాన్యువల్ ఫైళ్ల నిర్వహణ పరిస్థితిపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పాటు, ఈ మార్పుపై సంబంధిత మంత్రులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.మొత్తంగా 8వ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఇచ్చిన సందేశం స్పష్టంగా కనిపించింది-ఫైల్ క్లియరెన్స్‌లో వేగం పెరగాలి, నిర్ణయాల్లో జాప్యం తగ్గాలి, ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ దిశగా వెళ్లాలి. ఈ సమీక్షలో అచ్చెన్నాయుడు వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలవడం ప్రధాన ఆకర్షణగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TheTeluguNews