Dailyhunt
ఐపీఎల్ ఆడనివ్వట్లేదు, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతా... క్రికెటర్ షాకింగ్ ఫిర్యాదు..

ఐపీఎల్ ఆడనివ్వట్లేదు, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతా... క్రికెటర్ షాకింగ్ ఫిర్యాదు..

Times Now Telugu 2 weeks ago

హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ వంటి కొంతమంది క్రికెటర్లు, అంతర్జాతీయ క్రికెట్‌ కోసం ఐపీఎల్‌కి దూరంగా ఉంటున్నారు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు, ఐపీఎల్‌ లాంటి లీగ్ క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ క్రికెట్ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకుంటున్నారు.

తాజాగా శ్రీలంక క్రికెటర్, ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్‌ఓసీ ఇవ్వడం లేదని, లంక క్రికెట్ బోర్డుపైనే కేసు వేశాడు. అతను మరెవ్వరో కాదు లంక క్రికెటర్, పేసర్ నువార్ తుషార.

ఐపీఎల్‌లో అమ్ముడుపోయిన నువాన్ తుషార, మతీశ పథిరాణా వంటి ప్లేయర్లకు ఎన్‌ఓసీ ఇవ్వడానికి నిరాకరించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. లంక నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో నువాన్ తుషార, పథిరాణా ఫెయిల్ అయ్యారు. దీంతో ఐపీఎల్ ఆడేందుకు వీలు లేదని తేల్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు.

  • లంక క్రికెట్ బోర్డుపై పిటిషన్..

'శ్రీలంక క్రికెట్ బోర్డుతో నా సెంట్రల్ కాంట్రాక్ట్ మార్చి 31తోనే ముగిసింది. నా కంట్రాక్ట్‌ని రెన్యూవల్ చేయడం తనకి ఇష్టం లేదని కూడా బోర్డుతో స్పష్టంగా చెప్పాను. అయినా సరే, నన్ను, ఐపీఎల్‌లో ఆడనివ్వకుండా అడ్డుకుంటున్నారు. లంక క్రికెట్ బోర్డు కారణంగా తనకి రూ. 2 కోట్ల వరకూ నష్టం ఏర్పడింది. ఎన్‌ఏసీ ఇవ్వకపోతే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.. ' అంటూ నువాన్ తుషార, తన పిటిషన్‌లో పేర్కొన్నట్టుగా శ్రీలంక మీడియా అవుట్‌లెట్ న్యూస్‌వైర్ రాసుకొచ్చింది.

ఈ పిటిషన్‌లో శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ షమ్మి సిల్వతో పాటు సెక్రటరీ బందుల దిస్సనాయకే, ట్రెజరర్ సుజీవ గోడలియడ్డ, సీఈవో అస్లే డి సిల్వల పేర్లను పిటిషన్‌లో పేర్కొన్నాడు నువాన్ తుషార. నువాన్ తుషార వేసిన పిటిషన్‌పై కొలంబో జిల్లా కోర్డులో ఏప్రిల్ 9న వాదనలు జరగబోతున్నాయి.

  • ఆర్‌సీబీ స్టార్ పేసర్...

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నువాన్ తుషారని రూ.1.6 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 సీజన్‌లో ఒకే ఒక్క గేమ్ ఆడిన నువాన్ తుషార, ఒకే ఒక్క వికెట్ తీశాడు. అంతకుముందు ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు, రూ.4.8 కోట్లకు నువాన్ తుషారని కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో నువాన్ తుషార 7 మ్యాచులు ఆడి 8 వికెట్లు తీశాడు.

2025 సీజన్‌ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి, మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్‌ని దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2026 సీజన్ బరిలో దిగుతోంది. నువాన్ తుషార ఫిట్‌నెస్‌పై క్లియరెన్స్ రాకపోవడంతో అతని రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌ని ఇంకా అనౌన్స్ చేయలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం అందుకుని, బోణీ కొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆదివారం, ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తర్వాతి మ్యాచ్ ఆడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu