Dailyhunt
దేశానికే ఆదర్శంగా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ...అధునాతన ఫైర్ టెండర్ వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

దేశానికే ఆదర్శంగా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ...అధునాతన ఫైర్ టెండర్ వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

Times Now Telugu 2 weeks ago

దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు.

అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, రూ.10 కోట్లతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను కొనుగోలు చేసింది. వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకున్నందుకు సీఎం అధికారులను అభినందించారు.

హైరైజ్డ్ బిల్డింగ్‌ల నిర్మాణం అవుతున్నాయి
ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రాజధానితో పాటు ఇప్పుడు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్‌లు నిర్మాణం అవుతున్నాయని... వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాలా ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. అన్ని సవాళ్ళను అధిగమించి... కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ పీవీ రమణ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu