రాజకీయాలు, సినిమాలు ఒక్కటి కాదు. ఏ రాజకీయ నాయకుడు కూడా సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయారు. అయితే రాజకీయాల్లో మాత్రం కొంతమంది స్టార్లు ఓ వెలుగు వెలిగారు.
వెండితెర గ్లామర్ని వాడుకుని, జనం అండదండలతో పొలిటికల్ స్టార్లుగానూ ఎదిగారు. అందులో ఇద్దరు మాత్రమే సొంతంగా పార్టీలను స్థాపించి, ముఖ్యమంత్రులుగా సేవలు అందించారు.
- ఎంజీ రామచంద్రన్: తమిళనాట స్టార్ హీరోగా వెలుగు వెలిగిన ఎంజీ రామచంద్రన్, 1972లో అన్నా ద్రవిడ మున్నెత్ర కళగం (ADMK) పార్టీని స్థాపించాడు. ఐదేళ్ల తర్వాత 1977లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. 1977లో 144 సీట్లు సాధించిన అన్నాడీఎంకే పార్టీ, 1980లో 162 సీట్లు సాధించింది. 1994లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన అన్నా డీఎంకే 195 సీట్లు సాధించింది. మూడు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఎంజీ రామచంద్రన్..
- ఎన్టీ రామారావు: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తొలి పరాజయాన్ని చూపించిన మహా నేత నందమూరి తారక రామారావు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు, పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి, సరికొత్త చరిత్ర లిఖించారు. శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా, వెంకటేశ్వర స్వామి తెరపై తన నటనతో తెలుగువారికి ఆరాధ్య నటుడిగా మారిన ఎన్టీఆర్, 'తెలుగువారి ఆత్మగౌరవం' నినాదంతో జనంలోకి వచ్చిన ఎన్టీ రామారావుకి తెలుగు ప్రజులు నీరాజనాలు పట్టారు. 1983లో 294 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, 202 సీట్లలో గెలిచి, తిరుగులేని మెజారిటీ సాధించింది. ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఎన్టీ రామారావు..
- జయలలిత: ఎంజీ రామచంద్రన్తో కలిసి సినిమాలు చేసిన జయలలిత, ఆయన అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి వచ్చింది. ఎంజీఆర్ మరణం తర్వాత 1991లో తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసింది జయలలిత. తమిళ ప్రజలతో ప్రేమగా 'అమ్మా' అని పిలిపించుకున్న జయలలిత, 6 సార్లు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.
- జానకి రామచంద్రన్: దివంగత నటుడు ఎంజీ రామచంద్రన్ మరణం తర్వాత ఆయన భార్య, నటి నారాయణ జానకి, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. 24 రోజుల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న జానకి, ఆ తర్వాత జయలలిత కారణంగా తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. జానకి రామచంద్రన్ కూడా సినీ నటియే. ఆ తర్వాత 1989 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా మెజారిటీ దక్కించుకోలేకపోయారు జానకి.
- జోసఫ్ విజయ్: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ఘన విజయం అందుకుంది. 100కి పైగా సీట్లలో భారీ మెజారిటీ సాధించిన టీవీకే పార్టీ, ప్రభుత్వ ఏర్పాటు దిశగా పావులు కదపనుంది. ఇదే జరిగితే ఎంజీ రామచంద్రన్, ఎన్టీ రామారావు, జయలలిత, జానకి రామచంద్రన్ తర్వాత సౌత్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న నటుడిగా నిలుస్తాడు జోసఫ్ విజయ్.
Read more news like this on telugu.timesnownews.com

