Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold: బంగారం బిస్కెట్ కొని నగలు తయారు చేయించాలి అనుకుంటున్నారా.... అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే... లేకపోతే మోసపోవడం ఖాయం...

Gold: బంగారం బిస్కెట్ కొని నగలు తయారు చేయించాలి అనుకుంటున్నారా.... అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే... లేకపోతే మోసపోవడం ఖాయం...

Times Now Telugu 1 week ago

బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం కోసం జీవితకాలం దాచుకున్న డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.

పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి. అలాంటి సమయంలో అప్పులు చేసి మరీ బంగారు ఆభరణాలను జనాలు కొనుగోలు చేస్తుంటారు.

మరి ఇంత విలువైనటువంటి బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బంగారు ఆభరణాల విషయంలో అత్యంత ముఖ్యమైనది చాలామంది పాటించే పద్ధతి గోల్డ్ బిస్కెట్ కొనుగోలు చేసి, ఆ తర్వాత స్వర్ణకారుడు వద్ద బంగారు ఆభరణాలను తయారు చేయించుకుంటారు. దీనివల్ల నమ్మకంగా తమకు బంగారు ఆభరణాలు లభిస్తాయి అని చాలామంది భావిస్తుంటారు.

హైదరాబాద్ నగరంలో చాలామంది ఈ తరహాలో స్వర్ణకారుల వద్ద బంగారు ఆభరణాలను తయారు చేయించుకోవడం చూడవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బేగం బజార్ సమీపంలో సిద్ధి అంబర్ బజార్‌లో ఉన్నటువంటి శ్రీకృష్ణ జ్యువెలరీస్ షాపులో మేలిమి బంగారం బిస్కెట్లు, కాయిన్లను పెద్ద సంఖ్యలో జనాలు లైన్లో నిలబడి మరీ కొనుగోలు చేస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ఈ నగల దుకాణంలో గడచిన కొన్ని దశాబ్దాలుగా మేలిమి బంగారం బిస్కెట్లు, కాయిన్లను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇలా కొనుగోలు చేసినటువంటి బంగారం బిస్కెట్లు లేదా కాయిన్స్‌ను బంగారు ఆభరణాలుగా తయారు చేయించుకుంటారు. హైదరాబాద్ నగరంలో బంగారు ఆభరణాల తయారీకి చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి గుల్జార్ హౌజ్ స్వర్ణకారులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ బంగారు ఆభరణాల తయారీ అనేది హోల్‌సేల్ వ్యాపారంలా కొనసాగుతుంది. ఇక్కడ చిన్న చిన్న సందుల్లో నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు వందల సంఖ్యలో ఉంటారు. వీరంతా చిన్న చిన్న యూనిట్లలో రాత్రింబవళ్లు నగలను తయారు చేస్తారు. ఇక్కడికి వచ్చి తమ ఆర్డర్లను ఇచ్చి స్వర్ణకారులతో నగలను తయారు చేయించుకుంటారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నటువంటి నక్షీ వర్క్ నగలు, అలాగే కుందన్ వర్క్ నగలు ఇక్కడ ఎక్కువగా లభిస్తుంటాయి.

ఇక సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్ లోపల ఉన్నటువంటి పాట్ మార్కెట్ గడచిన కొన్ని దశాబ్దాలుగా స్వర్ణకారులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ స్వర్ణకారులు వసూలు చేసే మజూరి పెద్ద పెద్ద షోరూమ్‌లతో పోల్చి చూస్తే చాలా తక్కువ అని చెప్పవచ్చు.

ఇక బంగారు ఆభరణాలను తయారు చేసే సమయంలో స్వర్ణకారుల వద్ద కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నగలను తయారు చేసే సమయంలో తరుగు పేరిట మోసం జరిగే అవకాశం ఉంటుంది. అంటే నగలు తయారు చేసే సమయంలో వాటిని కరిగించినప్పుడు, కత్తిరించినప్పుడు కొద్దిగా బంగారం అనేది వృథా అవుతుంది. దీన్నే తరుగు అంటారు. కొంతమంది స్వర్ణకారులు, చిన్న షాపుల వాళ్లు తరుగును 10 నుంచి 15 శాతం వరకు అయ్యిందని చెబుతుంటారు. కానీ నిజానికి ప్రస్తుతం మారిన టెక్నాలజీ పరంగా చూసినట్లయితే అంత తరుగు అయ్యే అవకాశం లేదు. కనుక తరుగు అనేది 5 నుంచి 8 శాతం మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి.

ఇక మీరు నగలను తయారు చేసుకున్న తర్వాత అధికారిక హాల్‌మార్కింగ్ సెంటర్ వద్దకు వెళ్లి మళ్లీ టెస్ట్ చేయించుకొని ముద్ర వేయించుకుంటే మంచిది. అలాంటి నగలను మీరు తిరిగి విక్రయించడానికి లేదా బ్యాంకులో తాకట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు స్వర్ణకారులు తయారుచేసి ఇచ్చిన నగల నాణ్యతను కనుక్కునే అవకాశం ఉంటుంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu