IPL 2026: శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్లో కెప్టెన్గా మారాడు రిషబ్ పంత్ (Rishabh Pant). ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ని మొట్టమొదటిసారిగా ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్, గాయం కారణంగా ఆ తర్వాతి సీజన్కి దూరమయ్యాడు.
దీంతో రిషబ్ పంత్కి కెప్టెన్సీ దక్కింది. పంత్ కెప్టెన్సీ స్కిల్స్ బాగా నచ్చడంతో అయ్యర్ గాయం నుంచి కోలుకున్నా.. అతన్నే కెప్టెన్గా కొనసాగించారు. ఈ కారణంగానే శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ (Lucknow Super Giants) కి వచ్చిన విషయం తెలిసిందే..
- పాయింట్ల పట్టికలో ఆఖరి పొజిషన్లో...
ఐపీఎల్ 2025 సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయిన లక్నో సూపర్ జెయింట్స్, 2026 సీజన్లోనూ ఫ్లాప్ షో కొనసాగిస్తోంది. 9 మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిస్తే కానీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండవు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 228 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది లక్నో సూపర్ జెయింట్స్.
నికోలస్ పూరన్ 63 మిచెల్ మార్ష్ 44, అయిడిన్ మార్క్రమ్ 31, హిమ్మత్ సింగ్ 40 పరుగులు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ 228 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ కలిసి తొలి వికెట్కి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈ లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది ముంబై ఇండియన్స్.
'లక్నో టీమ్, ముంబైతో మ్యాచ్లో కేవలం 5 బౌలర్లను మాత్రమే వాడింది. అయిడిన్ మార్క్రమ్ లాంటి బౌలర్ ఉన్నా, అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. గుడ్ లెంగ్త్లో బంతులు వేసి, బ్యాటర్లను ఊరిస్తూ వికెట్లు తీయడం ఆవేశ్ ఖాన్ స్పెషాలిటీ. అయితే అతను కూడా యార్కర్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అది అతని బలం కాదు, రాని దాన్ని ప్రయత్నించే బదులు, వచ్చిన దాన్ని సరిగ్గా అమలు చేయొచ్చు కదా..
జోష్ ఇంగ్లీష్ని తుది జట్టులోకి తీసుకోవడంతో, ఇంటర్నేషనల్ బౌలర్ని ఆడించే అవకాశం లేకుండా పోయింది. రిషబ్ పంత్లో నాకు కెప్టెన్సీ స్కిల్స్ ఏమీ కనిపించడం లేదు. రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ భారీ భాగస్వామ్యం నిర్మిస్తూ పోతుంటే రిషబ్ పంత్ చూస్తూ ఉన్నాడు.
- జీరో ప్లాన్స్... క్లూ లెస్ కెప్టెన్...
వికెట్ తీయడానికి, భాగస్వామ్యాన్ని విడదీయడానికి అతని దగ్గర ఎలాంటి ప్లాన్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. వాళ్లే అవుట్ అవుతారులే అని తాపీగా చూస్తున్నట్టుగా ఉంది... కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నవాళ్లు ఎవ్వరూ ఇలా చేయరు..' అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ లెజెండ్ షాన్ పోలాక్.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ని రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. అయితే ఇప్పటిదాకా ఈ ప్రైజ్ ట్యాగ్కి తగిన పర్ఫామెన్స్ మాత్రం రిషబ్ పంత్ నుంచి రాలేదు. ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభంలో 'మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ మాదిరిగానే రిషబ్ పంత్ కూడా ఐదు- ఆరు ఐపీఎల్ టైటిల్స్ గెలవబోతున్నాడు...' అంటూ ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయింకా చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి.
Read more news like this on telugu.timesnownews.com

