Dailyhunt
IPL 2026: 'ఒరేయ్ బుడ్డోడా.. వాడు బుమ్రా రా..!' 5 టైమ్ ఛాంపియన్‌ టీమ్‌కి చుక్కులు చూపించిన వైభవ్ సూర్యవంశీ...

IPL 2026: 'ఒరేయ్ బుడ్డోడా.. వాడు బుమ్రా రా..!' 5 టైమ్ ఛాంపియన్‌ టీమ్‌కి చుక్కులు చూపించిన వైభవ్ సూర్యవంశీ...

Times Now Telugu 1 week ago

IPL 2026 MI vs RR: బుజ్జిగాడు' మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది. 'ఒరేయ్.. అక్కడుంది శివన్న రా..' అని, దానికి బుజ్జిగాడు, 'ఆ అయితే... ' అని సమాధానం ఇస్తాడు.

ఐపీఎల్‌ 2026 (IPL 2026)లో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. అరవీర భయంకర బ్యాటర్లను కూడా భయపట్టగల వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah). అలాంటి బూమ్ బూమ్ బుమ్రాని ఓ 15 ఏళ్ల బుడ్డోడు, భయపెట్టినంత పని చేశాడు. అతనే క్రికెట్ యంగ్ సెన్సేషనల్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, దీపక్ చాహార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొత్తం ఎదుర్కొన్ని 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు రాబట్టాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ, మ్యాచ్‌లో మొదటి బంతినే బుమ్రా బౌలింగ్‌లో ఎదుర్కోవాల్సి వచ్చింది.

  • Vaibhav Sooryavanshi vs Jasprit bumrah..

బుమ్రా బౌలింగ్‌లో ఎదురొన్న మొదటి బంతికే భారీ సిక్సర్ బాదిన వైభవ్ సూర్యవంశీ, అదే ఓవర్‌లో మరో సిక్సర్ బాదాడు. మొన్నమొన్ననే 15 ఏళ్లు నిండిన బుడతడు, తన బౌలింగ్‌లో కొట్టిన షాట్స్‌ని జస్ప్రిత్ బుమ్రా.. నోరెళ్లబెట్టి చూస్తూ నవ్వుకోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.

14 బంతుల్లో ఓ ఫోర్, 5 సిక్సర్లతో 39 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ, క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లను ఉతికి ఆరేశాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ అవుటైన బాల్ కూడా బౌండరీ లైన్ దగ్గర తిలక్ వర్మ జంప్ చేసి క్యాచ్ అందుకోవాల్సి వచ్చింది. లేదంటే వెళ్లి బౌండరీ అవతల పడి ఉండేది.

  • స్టార్ బ్యాటర్ల కంటే ఎక్కువ...

ఐపీఎల్ కెరీర్‌లో డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, జోస్ బట్లర్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, శిఖర్ ధావన్, షేన్ వాట్సన్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శుభ్‌మన్ గిల్, శివమ్ దూబే, ఆరోన్ ఫించ్, బెన్ స్టోక్స్, నికోలస్ పూరన్, రింకూ సింగ్, ట్రావిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్ల కంటే వైభవ్ సూర్యవంశీ, బుమ్రా బౌలింగ్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసినా యశస్వి జైస్వాల్ మాత్రం ఎక్కడా దూకుడు తగ్గించలేదు. దీపక్ చాహార్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు రాబట్టాడు యశస్వి జైస్వాల్. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్, ఏఎం ఘజన్‌ఫర్, బుమ్రా, శార్దూల్.. ఇలా ఏ బౌలరీపై జాలి చూపించలేదు, పాపం.. అని వదిలేయలేదు.

వర్షం కారణంగా మ్యాచ్ 11 ఓవర్లకు కుదించడంతో వచ్చిన బంతిని వచ్చినట్టుగా బౌండరీ అవతలకు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపించారు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్. ఈ ఇద్దరూ కలిసి 46 బంతులను ఎదుర్కొంటే.. అందులో 11 ఫోర్లు, 9 సిక్సర్లు బాదేశారు.

  • ముంబైపై రాజస్థాన్ 'రాయల్' విక్టరీ..

వీళ్లు బాదుడు చూసి... పిచ్ బ్యాటర్లకు చక్కగా సహకరిస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఈజీగా సిక్సర్లు కొట్టిన చోట, ముంబై బ్యాటర్లు బొక్క బోర్లా పడ్డారు. వేగంగా ఆడే ప్రయత్నంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. రోహిత్ శర్మ 5, రియాన్ రికెల్టన్ 5, సూర్యకుమార్ యాదవ్ 6, తిలక్ వర్మ 14, హార్దిక్ పాండ్యా 9, నమన్ ధీర్ 25, రూథర్‌ఫర్డ్ 25 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు.

రాజస్థాన్ రాయల్స్, 11 ఓవర్లలో 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఇదే ఊపు 20 ఓవర్ల పాటు కొనసాగి ఉంటే, ఈజీగా 300+ కొట్టేవాళ్లని చాలా మంది అభిప్రాయపడ్డారు. యశస్వి జైస్వాల్, సిమ్రాన్ హెట్మాయర్, ఫెర్రారియా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్ వరకూ ఉన్న బ్యాటింగ్ లైనప్‌ని చూసి, 300 పెద్ద కష్టమయ్యేది కూడా కాదు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu