IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ షో కొనసాగుతూ వస్తోంది. మొదటి మ్యాచ్లో కేకేఆర్ని ఓడించి, 14 ఏళ్ల ఆనవాయితీని బ్రేక్ చేశామని సంతోషించేలోపు..
ఆ తర్వాత 7 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.
ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నప్పటికీ టీమ్లో చాలా మంది ప్లేయర్లలో ఆ బాధ కనిపించడం లేదు. ముఖ్యంగా జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ పర్ఫామెన్స్, యాటిట్యూడ్.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ని, టీమిండియా ఫ్యాన్స్ని కలవరబెడుతోంది.
- 8 మ్యాచుల్లో 2 వికెట్లు...
ఐపీఎల్ 2026 సీజన్లో మొదటి 5 మ్యాచుల్లో వికెట్ తీయలేకపోయిన జస్ప్రిత్ బుమ్రా, గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే సాయి సుదర్శన్ వికెట్ తీశాడు. అయితే ఆ తర్వాత రెండు మ్యాచుల్లో కలిపి ఒకే వికెట్ తీశాడు జస్ప్రిత్ బుమ్రా..
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఒక్క వికెట్ తీయలేకపోయిన జస్ప్రిత్ బుమ్రా, 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించాడు. సలీల్ అరోరా వంటి యంగ్ బ్యాటర్ కూడా బుమ్రా బౌలింగ్లో ఎంతో ఈజీగా బౌండరీలు బాదడం చూసి సగటు టీమిండియా అభిమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. 
- ఆ బ్యాచ్కి ముంబై గెలవడం ఇష్టం లేదా?
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతనిపై అరిచాడు, చిరాకు చూపించాడు. ఈ ప్రవర్తనపై డగౌట్లో కూర్చున్న రోహిత్ శర్మ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన తర్వాత ముంబై ఇండియన్స్ని గెలిపించాలనే కసి, జస్ప్రిత్ బుమ్రాలో కనిపించడం లేదని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ వరుస మ్యాచుల్లో చిత్తుగా ఓడుతుంటే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రీల్స్ చూస్తూ, మిగిలిన ప్లేయర్లతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్కి అత్యంత నమ్మకస్తుడు, ఆప్తుడు అయిన సూర్యకుమార్ యాదవ్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు.
చూస్తుంటే హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గెలవడం, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లకు ఇష్టం లేనట్టుగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ముంబై ఇండియన్స్ డౌన్ ఫాల్ని రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఎవ్వరూ ఎంజాయ్ చేయడం లేదంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. 
- చిచ్చు అక్కడే మొదలైందా...
ఐపీఎల్ 2023 సీజన్లో జోఫ్రా ఆర్చర్, జస్ప్రిత్ బుమ్రా వంటి కీ ప్లేయర్లు లేకపోయినా ముంబై ఇండియన్స్ టీమ్ని రెండో క్వాలిఫైయర్ దాకా తీసుకెళ్లాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆకాశ్ మద్వాల్, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్ వంటి బేస్ ప్రైజ్ బౌలర్లతో ముంబై ఇండియన్స్ ఇచ్చిన పర్ఫామెన్స్ చూసి.. క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే 2024 సీజన్కి ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.
రోహిత్ శర్మకు అత్యంత ఆప్తులైన బుమ్రా, సూర్య బహిరంగంగానే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. అప్పటి నుంచే ఈ బ్యాచ్కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ మ్యాచులు గెలవడం ఇష్టం లేదనే అనుమానాలు, అభిమానుల్లో ఉన్నాయి. అందుకే ముంబై వరుస ఫెయిల్యూర్స్ తర్వాత 'రోహిత్ హ్యాపీయేనా, బుమ్రా ఫుల్ ఖుష్ అంటాగా.. సూర్య డ్యాన్స్ చేస్తున్నాడంటగా..' అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
Read more news like this on telugu.timesnownews.com

