Dailyhunt
కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు... నిందితుల ఫొటోలు విడుదల, సమాచారమిస్తే రూ. లక్ష బహుమతి

కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు... నిందితుల ఫొటోలు విడుదల, సమాచారమిస్తే రూ. లక్ష బహుమతి

Times Now Telugu 1 week ago

రీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం సుమారు 10 గంటలకు గుర్తుతెలియని ఐదుగురు దొంగలతో కూడిన ముఠా పీఎంకే జ్యువెలరీ షాప్‌లోకి ప్రవేశించి...

కాల్పులు జరిపి నగలతో పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. జ్యువెలరీ షాపులోని సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ని సేకరించి నిందితుల జాడ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా నగర శివారు ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితుల ఫొటోలను కూడా పోలీసులు విడుదల చేశారు.

ఆ ఫొటోల్లోని దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు కరీంనగర్ పీఎంకే జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీ చేశారని పేర్కొన్నారు. ఆ దొంగలను గుర్తిస్తే 8712670762, 8712670711, 8712670713 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ దొంగల గురించి సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. అలాగే, సమాచారం అందించినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇక, పీఎంజే జ్యువెలరీ షాపులో ఆదివారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం ఐదుగురు దుండగులు జ్యువెలరీ షాపులోకి ప్రవేశించినట్టుగా చెబుతున్నారు. అనంతరం వారు జ్యువెలరీ షాపులోని సిబ్బందిని గన్స్‌తో బెదిరించారు. దీంతో సిబ్బంది తీవ్ర భయాందోళన చెందారు. అయితే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై కాల్పులుల జరిపారు. అనంతరం ఆభరణాలు దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. దీంతోవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పీఎంజే జ్యువెలరీకి చేరుకున్నారు. పీఎంజే జ్యువెలరీ లోపల, పరిసరాలను పరిశీలించారు. అసలేం జరిగిందనేది సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే, అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే, నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగిస్తున్నారు.

దుండగులు పీఎంజే జ్యువెలరీ లోపల సిబ్బందిని బెదిరిస్తున్న దృశ్యాలు, ఆభరణాలు దోచుకున్న అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

మరోవైపు ఘటనాస్థలిలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తూ దుండగులు ఉపయోగించిన వాహనాలు, వెళ్లిన మార్గాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నగర శివార్లు, జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu