రళం సీఎం అభ్యర్థిపై ఎట్టకేలకు ఉత్కంఠ తొలగింది. కేరళం సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం వీడీ సతీశ్ను ఖరారు చేసింది.కేరళం సీఎం పదవి కోసం త్రిముఖ పోరు నెలకొంది.
వీడి సతీశన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ల మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపికక కోసం వచ్చిన ఏఐసీసీ పరిశీలకులు సైతం రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీకి కత్తిమీదసాములా మారింది. చివరికి వీడీ సతీశన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.తుది నివేదికను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానంకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సీఎం అభ్యర్థిపై మరింత ఉత్కంఠ నెలకొంది.
కేరళం సీఎంగా వీడీ సతీశ్న్
కేరళం 13వ రాష్ట్రముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ను ఎంపిక చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు దీప్దాస్ మున్షీ, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఈ ప్రకటన చేశారు.ఇకపోతే సీఎం పదవిపై ముగ్గురు నేతలు పోటీపడ్డారు. గురువారం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు వీడీ సతీశన్ను ఎంపిక చేసింది. అనంతరం సీఎం రేసులో ఉన్న మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి సతీశన్ను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సహకరించుకోవాలని సూచించారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా రాహుల్ గాంధీ గురువారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.చివరకు వీడీ సతీశన్ ఎంపికపై క్లారిటీ ఇచ్చేశారు.
వీడీ సతీశన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఇకపోతే ఇకపోతే కొచ్చి జిల్లాకు చెందిన 62 ఏళ్ల సతీశన్ వృత్తిరీత్యా న్యాయవాది. 2001లో పారావూర్ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అన్ని అంశాలపై మంచి సబ్జెక్టు ఉంది. అలాగే తన వాగ్ధాటితో ఇతరులను చాలా తేలికగా ఆకట్టుకునేవారు. అంతేకాదు అసెంబ్లీలో ఆధారాలతో సహా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా యువ నాయకులను, కార్యకర్తలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘోర పరాజయం తర్వాత అనూహ్యంగా ప్రతిపక్ష నేతగా వీడీ సతీశన్ ఎంపికయ్యారు.ప్రతిపక్ష నేతగా చాలా హుందాగా వ్యవహరించేవారు. అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ అందరితో మమేకం అవుతూ తన రాజకీయ ఎదుగుదలకు బాటలు వేసుకున్నారు. అంతేకాదు గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, ఏఐ కెమెరాల ఆరోపణల వంటి అంశాలపై పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయ్యారు.మెుత్తానికి ప్రతిపక్ష నేత కుర్చీ నుంచి ఇవాళ సీఎం స్థాయికి ఎదిగారు వీడీ సతీశన్, వీడీ సతీశన్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ఐదేళ్లుగా విపక్షనేతగా పనిచేసిన వీడీ సతీశన్
కేరళం కొత్త ముఖ్యమంత్రి వీడీ సతీశన్ గత ఐదేళ్లుగా విపక్ష నేతగా కొనసాగుతున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రజావాణిని బలంగా వినిపించారనే పేరు ఉంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.పరవూర్లో సీపీఐ నేత టైసన్ మాస్టర్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. వీడీ సతీశన్కు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ మద్దతు ఉంది. సతీశన్ సీఎం అయితే మైనారిటీలకు ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే ఐయూఎంఎల్ అధ్యక్షుడు పనక్కడ్ సాదిక్ అలీ తంగల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. పినరయి విజయన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, బంధుప్రీతి, అసమర్ధ పాలనపై సతీశన్ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో అధిష్టానం వద్ద మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం...పీసీసీ చీఫ్గా సమర్థవంతంగా పనిచేశాడని నమ్మిన కాంగ్రెస్ పార్టీ వీడీ సతీశన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.
Read more news like this on telugu.timesnownews.com

