Dailyhunt
ముగిసిన ఇరాన్ అమెరికా యుద్ధం! రెండు పక్షాలు ఎలా విజయాన్ని ప్రకటించుకున్నాయంటే...

ముగిసిన ఇరాన్ అమెరికా యుద్ధం! రెండు పక్షాలు ఎలా విజయాన్ని ప్రకటించుకున్నాయంటే...

Times Now Telugu 3 weeks ago

ట్టకేలకు ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసింది. విరామం రెండు వారలు మాత్రమే అన్నప్పటికీ... పరిస్థితుల దృష్ట్యా ఈ యుద్ధం ముగిసినట్టే కనబడుతుంది. ఒక మొత్తం నాగరికతను తుడిచిపెట్టేస్తాను అని కొన్ని గంటల కింద చెప్పిన ట్రంప్, తాజాగా ఇరాన్ తో రెండు వరాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాడు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ...ఇరు పక్షాలు 2 వారాలపాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఒప్పుకుందని ట్రంప్ తెలిపాడు.
ఈ సందర్భంగా ట్రంప్ పాక్ ప్రధాని షెహబాజ్ షెరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ లకు థాంక్స్ చెప్పాడు . ఇరాన్ 10 ప్రతిపాదనలు ప్రతిపాదించిందని, 2 వారాల సమయంలో దీన్ని ఫైనలైజ్ చేస్తామని, ఈ సమయం సరిపోతుందని ట్రంప్ తెలిపాడు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ తక్షణమే హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఒప్పుకుందని ట్రంప్ తెలిపాడు.
ఇరాన్ సైతం వెంటనే సోషల్ మీడియా ద్వారా రెండు వారాల కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టు తెలిపింది. ఇరాన్ మీద దాడులు ఆపేస్తే, ఇరాన్ సైతం రెండు వారాల పాటు యుద్ధ విరమణకు ఒప్పుకుంటుందని, హర్మూజ్ గుండా నౌకల ప్రయాణానికి తాము అనుమతిస్తామని తెలిపింది.
ఇదొక చరిత్రాత్మక విజయం అంటూ అభివర్ణించిన ఇరాన్...ఇజ్రాయెల్, అమెరికాలు తమ చేతిలో అత్యంత ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొని, తమ ప్రతిపాదనలకు అంగీకరించాయని ప్రకటించింది. వీరుల త్యాగం, ఖమేనీ చిందించిన రక్తం, మొజతబా ఖమేనీ నాయకత్వం వెరసి తాము ఈ యుద్ధంలో విజయం సాధించామని ఇరాన్ తెలిపింది.
యురేనియం ని శుద్ధి చేసేందుకు(ఎన్రిచ్మెంట్), హర్మూజ్ పై ఇరాన్ కంట్రోల్, తక్షణమే అన్ని ఆంక్షలను ఎత్తేయడం సహా తమ 10 ప్రతిపాదనలకు అమెరికా గత్యంతరం లేక ఒప్పుకుందని ఇరాన్ ప్రకటించింది. మరోపక్క అమెరికా సైతం తమ మిలిటరీ లక్ష్యాలను తాము చేరుకున్నామని, తాము అనుకున్నదానికంటే ఎంతో అపూర్వమైన విజయాన్ని సాధించామని ట్రంప్ ప్రకటించాడు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడానికి తాము ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్టు ట్రంప్ తెలిపాడు.
అయితే ఇరు పక్షాలు రెండు వారాలపాటు ఇస్లామాబాద్ లో చర్చలు జరపనున్నారు. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షెరీఫ్... ఏప్రిల్ 10వ తేదీన ఇరు పక్షాలను పాకిస్తాన్ ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మొత్తం వివాదానికి తెర దించుతూ ఒక ఒప్పందానికి రావడానికి ఈ చర్చలు దోహదం చేస్తాయని ప్రకటించాడు. ఇరు పక్షాలు కూడా పాకిస్తాన్ కి థాంక్స్ చెప్పడం కొసమెరుపు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu