Sharwanand: వరుస హిట్లతో మంచి జోష్ మీదున్న శర్వానంద్కి 'బైకర్' అనుకున్న రిజల్ట్ ఇవ్వలేకపోయింది. 'ఒకే ఒక జీవితం', 'మనమే', 'నారీ నారీ నడుమ మురారి' సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'బైకర్'కి మంచి రివ్యూస్ వచ్చినా కలెక్షన్లు ఆ రేంజ్లో రాలేదు.
'బైకర్' మూవీ ప్రమోషన్స్లో శర్వానంద్ చాలా సార్లు ఎమోషనల్ అవ్వడాన్ని ప్రేక్షకులు గమనించారు. శర్వా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడనే విషయం చాలా మందికి అర్థం కాలేదు. తాజాగా శర్వానంద్ విడాకులు తీసుకోబోతున్నాడనే వార్త, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి కారణం శర్వానంద్, తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తీసివేయడమే..
2023లో రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నాడు హీరో శర్వానంద్. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే కొన్ని నెలలుగా ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారనే వార్త, వైరల్ అవుతోంది.
- గత ఏడాదిలోనే..
శర్వానంద్, రక్షితా రెడ్డి విడాకులు తీసుకోబోతున్నారనే వార్త, 2025లోనే వచ్చింది. అయితే శర్వానంద్ టీమ్, ఈ వార్తల్లో నిజం లేదని అప్పుడు క్లారిటీ ఇచ్చింది. అయితే శర్వానంద్ ఇప్పుడు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి డిలీట్ చేయడంత మరోసారి ఈ విడాకుల గురించి చర్చ మొదలైంది.
శర్వానంద్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెళ్లి ఫోటోలు మాత్రమే కాదు, భార్య రక్షితా రెడ్డి ఫోటోలు కానీ, కూతురి ఫోటోలు కానీ లేవు. దీంతో శర్వానంద్ - రక్షితా విడాకులు తీసుకోవడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు.
- చిరంజీవితో కలిసి...
థమ్సప్ నిర్వహించిన లక్కీ డ్రాలో గెలిచి, చిరంజీవితో కలిసి యాడ్లో నటించాడు శర్వానంద్. ఆ తర్వాత 'ఐదో తారీఖు', 'సంక్రాంతి', 'లక్ష్మీ', 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'వెన్నెల' వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేశాడు.
'అమ్మ చెప్పింది', 'గమ్యం', 'అందరి బంధువయ' వంటి అవార్డు విన్నింగ్ సినిమాల్లో నటించిన శర్వానంద్కి 'ప్రస్థానం' మూవీతో బ్రేక్ లభించింది. ఆ తర్వాత 'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఎక్స్ప్రెస్ రాజా', 'శతమానం భవతి', 'మహానుభావుడు' వంటి హిట్లు అందుకున్నాడు.
- వరుస ఫ్లాపులు...
'పడి పడి లేచే మనసు', 'రణరంగం', 'జాను', 'శ్రీకారం', 'మహా సముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వంటి వరుస డిజాస్టర్ల తర్వాత 'ఒకే ఒక జీవితం' మూవీతో మంచి కమ్బ్యాక్ ఇచ్చాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్ని మెప్పించి, హిట్టు కొట్టాడు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించిన శర్వానంద్, సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' మూవీలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ 2026, ఆగస్టు 28న థియేటర్లలోకి రానుంది.
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'బైకర్' మూవీలో యాంగ్రీ యంగ్మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించాడు. మాళవిక నాయర్ హీరోయిన్గా నటించిన 'బైకర్' మూవీ, థ్రిల్లింగ్ స్పోర్ట్స్ డ్రామాగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
Read more news like this on telugu.timesnownews.com

