'కుర్చీ మడతపెట్టి' అనే ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాలో స్టార్గా ఎదిగిన కుర్చీతాత( మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా) మృతి చెందారు.హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూశారు.ఇకపోతే కృష్ణానగర్కు చెందిన మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ వాడారు.
ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాత్రికి రాత్రే మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా ఒక్కసారిగా కుర్చీతాతాగా ఫేమస్ అయిపోయారు. అదే సమయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని ఒక పాటలో ఈ డైలాగ్ వాడటంతో కుర్చీతాత సోషల్ మీడియా స్టార్గా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే ఒకనొక దశలో సోషల్ మీడియా, యూట్యూబ్ను షేక్ చేశారు. అలాంటి కుర్చీతాత మృతి చెందడంతో నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు RIP పోస్టులతో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కుర్చీతాత ఇకలేరు
హైదరాబాద్ కృష్ణానగర్కు చెందిన మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు. అయితే యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కుర్చీ మడత పెట్టి' డైలాగ్ వాడాడు. ఈ డైలాగ్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాడు కుర్చీ తాత(మహ్మద్ పాషా). గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే బుధవారం సాయంత్రం 5 కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలారు అని తెలుస్తోంది. అయితే మరికొంతమంది ఇంటి దగ్గరే తీవ్ర వడదెబ్బతో మృతి చెందాడని తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన తర్వాత నెటిజన్లు RIP పోస్టులతో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు కొందరు యూట్యూబర్స్ కుర్చీ తాత ఇంటికి వెళ్లి మరీ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కుర్చీతాతతో ఎంతో ఆప్యాయంగా ఉండే మరో యూట్యూబర్ వైజాగ్ సత్య కుర్చీతాత ఇంటికి వెళ్లి విలపించారు. లేడాడీ అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు
పారితోషికం అందజేసిన తమన్
'కుర్చీ తాత'గా మారిన కాలా పాషా సోషల్ మీడియాను షేక్ చేశారు. విపరీతంగా ఫ్యాన్స్ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఓవర్ నైట్లోనే యూట్యూబ్ స్టార్ అయిపోయారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో తమన్ వాడిన 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్తో మరింత పాపులారిటీ పొందారు. ఆ డైలాగ్కు గాను తమన్ నుంచి పారితోషికం కూడా అందడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.
గతంలో కుర్చీతాత మరణంపై పుకార్లు
గతంలో కూడా 'కుర్చీ తాత చనిపోయాడు' అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్వయంగా కుర్చీ తాతే మీడియా ముందుకు వచ్చి.. "నేను బ్రతికే ఉన్నాను, తప్పుడు వార్తలు నమ్మకండి" అంటూ ఆ పుకార్లను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.'నేను చనిపోలేదు. బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసి మా కుటుంబాన్ని బాధ పెట్టొద్దు. నా మరణ వార్త విని నా భార్య భయపడి బాగా ఏడ్చింది. ఇది చాలా బాధ కలిగించింది'అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బుధవారం శాశ్వతంగా కన్నుమూశారు కుర్చీతాత.
Read more news like this on telugu.timesnownews.com

