Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ మా అయ్యల జాగీరే...ప్రాణ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం: పవన్ కల్యాణ్‌పై గద్దర్ కుమార్తె వెన్నెల ఆగ్రహం

తెలంగాణ మా అయ్యల జాగీరే...ప్రాణ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం: పవన్ కల్యాణ్‌పై గద్దర్ కుమార్తె వెన్నెల ఆగ్రహం

Times Now Telugu 3 days ago

తెలంగాణ గడ్డ మీ అయ్య జాగీరా అంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె వెన్నెల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.'తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే..

తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు'అని వెన్నెల చెప్పుకొచ్చారు.నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్‌ కళ్యాణ్‌ను అభిమానిస్తాం అని చెప్పుకొచ్చారు. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు.తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం..ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం... తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్‌కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు'అని గద్దర్ తనయ వెన్నెల చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం
'ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. పవన్ అన్న మీరు ఒక నటుడిగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినో త్సవం రోజున మీరు మాట్లాడిన మాటలను ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఖచ్చితంగా ఖండిస్తున్నాను'అని వీడియోలో చెప్పుకొచ్చారు.'సినిమాల్లో యాక్ట్ చేస్తే తెలంగాణ రాలేదు. తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు. పైసలు పంచితే తెలంగాణ రాలేదు. లాబీలు చేస్తే తెలంగాణ రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవర్నీ ఒక బాధ పెట్టకుం డా, ఎవర్నీ హింసించకుండా, తనకు తాను ఆహుతి చేసుకున్న శ్రీకాంతాచారియే సాక్ష్యం'అని వెన్నెల గుర్తు చేశారు.

తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే
'మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే నినాదంతో పల్లె పల్లె గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ.తొలి దశ తెలంగాణ పోరాటంలో 2 వేలకు పైగా అమరులయ్యారు. అది ఆన్ రికార్డు. అలాగే మలిదశ తెలంగాణ ఉద్య మంలో 1200 మంది విద్యార్థులు అమ రులయ్యారు. ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలను కోల్పోయారు'అని వెన్నెల గుర్తు చేశారు. మీరన్నట్టే.. మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే.. ఈ రోజు మా జాగీరు.. రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే మా తెలంగాణ గడ్డనే మా త్యాగాల గడ్డనే' అని వెన్నెల స్పష్టం చేశారు.

గద్దర్‌పై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇవే
'ప్రపంచ కార్మికులారా ఏకం కండీ అని ఒకప్పుడు పిలుపునిచ్చిన వామపక్షాలు నేడు ప్రాంతీయతను రెచ్చగొట్టే స్థితికి చేరుకుంటున్నాయి. వామపక్ష భావజాలం, వామపక్ష సానుభూతిపరుల ముసుగులో కొందరు చేస్తున్న వ్యక్తిగత ప్రాంతీయత సిద్దాంతాల వల్లనే కమ్యూనిజం దేశంలో అంత్య దశకు వచ్చింది. గద్దర్ బతికి ఉన్నపుడు కనీసం ఆయనను పట్టించుకోని వామపక్ష మేధావులు ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్నతో నేను రాజకీయాలకు రాకముందు నుంచే పరిచయం ఉంది. నా ఖుషీ సినిమాలోని పాటలో పెట్టిన థీమ్ తాకట్టులో భారతదేశం స్ఫూర్తిని చూపిందని గద్దర్ గారు అన్న మాటలు నాకింకా గుర్తే. ఆయన వెన్నులో బుల్లెట్లు దిగినప్పుడు ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎక్కడ ఉన్నారు? నేటి వరకూ చెప్పలేదు - ఓ రోజు గద్దరన్న వచ్చి.. తమ్మి వెన్నులో ఇబ్బంది ఉంది... తిరగడం కష్టం అవుతోంది బండి తీసి ఇయ్యి అన్నారు. రెండు రోజుల్లో కారు పంపించాను' అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. 'తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రధాన కారణం అయిన బూర్గుల రామకృష్ణారావు పేరును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను కలిపే రహదారికి పెట్టాలనేది నా ఆకాంక్ష. ఏపీలోనూ గద్దర్‌ స్ఫూర్తిని తీసుకుంటాను. అక్కడ గద్దర్ విగ్రహం పెడతాం. తెలంగాణలో జనసేన సాధన మొదలుపెట్టే దశకు వెళ్తున్నాం. ప్రజలను మభ్యపెట్టం... మాయ చేయం. ప్రజా సమస్యల మీద ఉన్నది ఉన్నట్లుగా పోరాడుతాం. ప్రజల మధ్దతును చూరగొంటాం' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu