
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 224 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,008కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,566కి పెరిగింది. నిన్న మరో 461 మంది కరోనా నుండి కోలుకోగా..ఇప్పటివరకు మొత్తం 2,83,924 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం 4,518 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.