By - Sathwik |16 May 2026 12:00 PM IST
కొత్త గుర్తింపునకు సిద్ధమవుతోన్న రాయలసీమ
ఒకప్పుడు కరవు, వలసలు, వెనుకబాటుతనానికి ప్రతీకగా చెప్పుకునే రాయలసీమ ఇప్పుడు కొత్త గుర్తింపుకు సిద్ధమవుతోంది.
వ్యవసాయం, ఉద్యానవనాలు, ఖనిజ సంపదతో ముందుకు సాగుతున్న ఈ ప్రాంతం ఇకపై దేశ రక్షణ రంగంలోనూ కీలక పాత్ర పోషించబోతోంది. భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి రూపుదిద్దుకోబోతోంది. దేశ భద్రతా రంగంలో స్వదేశీ సాంకేతికతకు నాంది పలికే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరగడంతో రాయలసీమ అభివృద్ధి చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరై భూమిపూజ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్డీవో సంయుక్తంగా అమలు చేయనున్నాయి. దాదాపు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. భారతదేశంలో తొలి 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కావడం దీనికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..
భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతికతతో తయారుకానున్నాయి. స్టెల్త్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, మల్టీ రోల్ సామర్థ్యాలతో భారత వైమానిక దళానికి కొత్త బలం చేకూరనుంది. అంతర్జాతీయంగా అమెరికా ఎఫ్-35, రష్యా ఎస్యూ-57 తరహా యుద్ధ విమానాలకు పోటీగా నిలిచే స్థాయిలో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత యుద్ధ విమానాల అభివృద్ధి, టెస్టింగ్, నిర్వహణ కార్యకలాపాలు అన్నీ పుట్టపర్తి కేంద్రంగానే కొనసాగనున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అనుబంధ పరిశ్రమలు, సేవా రంగాలు, చిన్నతరహా యూనిట్లు ఏర్పడటం ద్వారా భవిష్యత్తులో లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఆకర్షితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాయలసీమ పారిశ్రామిక పటంలో కీలక ప్రాంతంగా ఎదగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమను మళ్లీ రతనాల సీమగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఒకప్పుడు ఎడారిలా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు పరిశ్రమలు, నీటి ప్రాజెక్టులు, సాంకేతిక రంగ అభివృద్ధితో కొత్త దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు. దేశ రక్షణ రంగానికి ఏపీ కీలక కేంద్రంగా మారబోతోందని, ఈ ప్రాజెక్టులు రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. పుట్టపర్తిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు మరో 12 రక్షణ, డ్రోన్ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం రూ.4,145 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, సుమారు 6,071 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రక్షణ, డ్రోన్, ఏరోస్పేస్ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు ప్రముఖ సంస్థలు ఈ పెట్టుబడుల్లో భాగస్వామ్యం అవుతున్నాయి.
కళ్యాణి స్ట్రాటజిక్ సంస్థ రూ.1,430 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును చేపడుతుండగా, HFCL రూ.1,040 కోట్లతో మరో కీలక యూనిట్ను ఏర్పాటు చేయనుంది. భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ రూ.489 కోట్ల పెట్టుబడితో రక్షణ రంగ తయారీ యూనిట్ను అభివృద్ధి చేయనుంది. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, డ్రోగో డ్రోన్స్, హెచ్సీ రోబోటిక్స్, ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్, జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్, సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్, అల్గోబాటిక్స్, లాట్రిక్ ఏరో స్పేస్, డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ వంటి సంస్థలు కూడా తమ ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయి. ఈ పరిశ్రమలు ప్రధానంగా మడకశిర, దొనకొండ, నెల్లూరు, కర్నూలు డ్రోన్ సిటీ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ముఖ్యంగా కర్నూలులో అభివృద్ధి చేస్తున్న డ్రోన్ సిటీ ప్రాజెక్టు దేశంలోనే అత్యాధునిక డ్రోన్ ఎకోసిస్టమ్గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్ తయారీ, పరిశోధన, టెస్టింగ్, శిక్షణ రంగాల్లో ఈ కేంద్రం కీలకంగా మారనుంది. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు విస్తరించే డ్రోన్ టెక్నాలజీకి ఏపీ ప్రధాన హబ్గా మారనుంది.
ఒకప్పుడు కరవు, వలసలు, వెనుకబాటుతనానికి ప్రతీకగా చెప్పుకునే రాయలసీమ ఇప్పుడు కొత్త గుర్తింపుకు సిద్ధమవుతోంది. వ్యవసాయం, ఉద్యానవనాలు, ఖనిజ సంపదతో ముందుకు సాగుతున్న ఈ ప్రాంతం ఇకపై దేశ రక్షణ రంగంలోనూ కీలక పాత్ర పోషించబోతోంది. భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి రూపుదిద్దుకోబోతోంది. దేశ భద్రతా రంగంలో స్వదేశీ సాంకేతికతకు నాంది పలికే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరగడంతో రాయలసీమ అభివృద్ధి చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరై భూమిపూజ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్డీవో సంయుక్తంగా అమలు చేయనున్నాయి. దాదాపు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. భారతదేశంలో తొలి 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కావడం దీనికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..

