Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: వచ్చే ఏడాది ఏపీలో 1500 కిలోల బంగారం ఉత్పత్తి

AP: వచ్చే ఏడాది ఏపీలో 1500 కిలోల బంగారం ఉత్పత్తి

TV5 News 1 week ago

By - Sathwik |15 May 2026 7:30 PM IST

బంగారం ఉత్పత్తికి చిరుమామాగా ఏపీ... జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభం

కర్నూలు జిల్లా జొన్నగిరి ఇకపై దేశవ్యాప్తంగా బంగారం ఉత్పత్తికి కొత్త గుర్తింపుగా నిలవబోతోందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు.

ఒకప్పుడు బంగారం అంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ పేరు వినిపించేదని, ఇకపై ఆ స్థానంలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు సహజ వనరుల వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏడాది 600 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే ఏడాదికి ఆ ఉత్పత్తిని 1500 కిలోలకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో సుమారు 598 హెక్టార్లలో ఈ గోల్డ్ ఫీల్డ్ విస్తరించి ఉంది. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రతి టన్ను మట్టిలో 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టుతోంది. కేవలం బంగారం తవ్వకాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో నగల వ్యాపారులకు నేరుగా బంగారం విక్రయించే ప్రణాళికలను కూడా సంస్థ రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.15,803 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాయలసీమను పరిశ్రమలు, ఖనిజ సంపదల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

కర్నూలును డ్రోన్‌ హబ్‌గా పిలుస్తారు: రాజ్‌నాథ్‌

రక్షణ రం­గం­లో సం­పూ­ర్ణ స్వా­వ­లం­బన సా­ధిం­చా­ల­నే లక్ష్యం­తో ముం­దు­కె­ళ్తు­న్నా­మ­ని కేం­ద్ర మం­త్రి రా­జ్‌­నా­థ్‌ సిం­గ్‌ అన్నా­రు. సత్య­సా­యి జి­ల్లా పు­ట్ట­ప­ర్తి­లో భారీ స్థా­యి­లో ఏర్పా­టు చే­య­బో­తు­న్న అడ్వా­న్స్‌­డ్ మీ­డి­యం కాం­బా­ట్ ఎయి­ర్‌­క్రా­ఫ్ట్‌ (ఏఎం­సీఏ) ప్రా­జె­క్టు శుం­కు­స్థా­ప­న­లో రాజ్ నాథ్ సిం­గ్ పా­ల్గొ­న్నా­రు. పబ్లి­క్‌, ప్రై­వే­టు రం­గా­లు చే­యి­చే­యి కలి­పి నడు­స్తు­న్నా­య­ని తె­లి­పా­రు. గత పదే­ళ్ల­లో ప్ర­భు­త్వ, ప్రై­వే­టు రం­గాల మధ్య అం­త­రా­న్ని తగ్గిం­చా­మ­న్నా­రు. ''యు­ద్ధ రం­గం­లో డ్రో­న్‌ టె­క్నా­ల­జీ ఒక గే­మ్‌ ఛేం­జ­ర్‌­గా ని­లి­చిం­ది. 8 డ్రో­న్‌ కం­పె­నీ­లు కలి­సి కర్నూ­లు­లో డ్రో­న్‌ సిటీ ప్రా­రం­భా­ని­కి సి­ద్ధ­మ­య్యా­యి. ఇక నుం­చి కర్నూ­లు­ను డ్రో­న్‌ హబ్‌­గా పి­లు­స్తా­రు. ఆర్థిక వ్య­వ­స్థ, వ్య­వ­సా­య­రం­గం­లో కూడా డ్రో­న్‌ పా­త్ర కీ­ల­కం­గా మా­రిం­ది. హె­చ్‌­ఎ­ఫ్‌­సీ­ఎ­ల్‌ రూ.1294 కో­ట్ల పె­ట్టు­బ­డి­తో రా­బో­తోం­ది. ఆయు­ధాల తయా­రీ రం­గం­లో స్వా­వ­లం­బన ది­శ­గా కొ­త్త అధ్యా­యం ప్రా­రం­భం కా­బో­తోం­ది. యు­ద్ధ­స­మ­యం­లో సొంత భద్రత కోసం ఇతర దే­శా­ల­పై ఆధా­ర­ప­డా­ల్సి వచ్చే­ది. కొ­న్నే­ళ్ల క్రి­తం రక్ష­ణ­రం­గం­లో ప్ర­పం­చం­లో­నే అతి­పె­ద్ద ది­గు­మ­తి­దా­రు­గా ఉం­డే­వా­ళ్లం. ఇప్పు­డు పరి­స్థి­తు­లు మా­రా­యి.. గత పదే­ళ్లు­గా చే­సిన కఠోర శ్ర­మ­కు ఫలి­తా­లు వస్తు­న్నా­యి. 2004లో కే­వ­లం భా­ర­త్‌ రూ.46వేల కో­ట్ల వి­లు­వైన ఆయుధ పరి­క­రాల తయా­రీ ఉం­డే­ది. ప్ర­స్తు­తం రి­కా­ర్డు స్థా­యి­లో రూ.1.75లక్షల కో­ట్ల­కు చే­రిం­ద­ని గర్వం­గా చె­బు­తు­న్నాం'' అని అన్నా­రు.

కర్నూలు జిల్లా జొన్నగిరి ఇకపై దేశవ్యాప్తంగా బంగారం ఉత్పత్తికి కొత్త గుర్తింపుగా నిలవబోతోందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ఒకప్పుడు బంగారం అంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ పేరు వినిపించేదని, ఇకపై ఆ స్థానంలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు సహజ వనరుల వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏడాది 600 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే ఏడాదికి ఆ ఉత్పత్తిని 1500 కిలోలకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో సుమారు 598 హెక్టార్లలో ఈ గోల్డ్ ఫీల్డ్ విస్తరించి ఉంది. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రతి టన్ను మట్టిలో 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టుతోంది. కేవలం బంగారం తవ్వకాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో నగల వ్యాపారులకు నేరుగా బంగారం విక్రయించే ప్రణాళికలను కూడా సంస్థ రూపొందిస్తున్నట్లు సమాచారం.

కర్నూలును డ్రోన్‌ హబ్‌గా పిలుస్తారు: రాజ్‌నాథ్‌

కర్నూలును డ్రోన్‌ హబ్‌గా పిలుస్తారు: రాజ్‌నాథ్‌

కర్నూలును డ్రోన్‌ హబ్‌గా పిలుస్తారు: రాజ్‌నాథ్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu