అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డుకెక్కిందని మాజీమంత్రి, టీడీపీ సీనియర్నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏపీలో రెండున్నరేళ్లుగా పెద్దఎత్తున అప్పులు పెరిగాయని అన్నారు.
ప్రభుత్వం కేపిటల్ ఎక్స్పెండీచర్ కోసం 31వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా లక్షా 68 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని యనమల ప్రశ్నించారు. మిగిలిన మొత్తం ఎక్కడ ఖర్చు చేసినట్టు, ఎవరి జేబులోకి మళ్లించినట్టు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రెవెన్యూ కోసం ఖర్చు చేస్తే ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించినట్టేనని యనమల ధ్వజమెత్తారు. అప్పుగా తెచ్చిన, ఆస్తులు తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ము ఏమవుతోందని అన్నారు.

