Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CBN: ప్రతి రూపాయీ సద్వినియోగం కావాలి: చంద్రబాబు

CBN: ప్రతి రూపాయీ సద్వినియోగం కావాలి: చంద్రబాబు

TV5 News 1 week ago

By - Sathwik |15 May 2026 10:00 AM IST

కీలక సూచనలు చేసిన చంద్రబాబు

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆదాయ వనరుల పెంపు అత్యంత కీలకమని భావిస్తున్న ప్రభుత్వం, వచ్చే ఆర్థిక సంవత్సరాల లక్ష్యాలపై దృష్టి సారించింది.

ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన శాఖల పనితీరు, ఆదాయ వృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర సొంత ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల దిశగా సాగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,345 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం, 2025-26 నాటికి రూ.1,10,643 కోట్లకు చేరినట్లు తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ, గనులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు వంటి ప్రధాన శాఖల నుంచి గణనీయమైన ఆదాయం లభించినట్లు వెల్లడించారు. జీఎస్టీ ద్వారా రూ.33,679 కోట్లు, గనుల శాఖ నుంచి రూ.10,300 కోట్లు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.11,047 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.

గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో ఆరు శాతం వృద్ధి నమోదైందని అధికారులు వివరించగా, దీనిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మరింత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రూ.1,27,506 కోట్ల ఆదాయం సాధించే దిశగా అన్ని శాఖలు కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు. గనులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ ఆదాయ వృద్ధికి తోడ్పడాలని ఆయన ఆదేశించారు.

పొదుపుచర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండొద్దు

ఆం­ద్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం తీ­సు­కు­నే పొ­దు­పు చర్య­లు ఒక్క­సా­రి­గా ప్ర­జ­ల­ను భయ­పె­ట్టే­లా ఉం­డ­కూ­డ­ద­ని ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్.. సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డి­కి సూ­చిం­చా­రు. ఈ రోజు జరి­గిన కే­బి­నె­ట్ సమా­వే­శం­లో ఈ సూచన చే­య­గా.. అం­దు­కు సీఎం సా­ను­కూ­లం­గా స్పం­దిం­చా­రు. ప్ర­భు­త్వం తీ­సు­కు­నే ప్ర­తీ ని­ర్ణ­యా­ని­కి 48 గంటల ముం­దే ప్ర­జ­ల­ను సన్న­ద్ధం చేసి.. సమయం తీ­సు­కు­ని ఆ ని­ర్ణ­యా­న్ని ప్ర­క­టి­ద్దా­మ­ని తె­లి­పా­రు. ఇక మం­త్రుల కా­ర్య­ద­ర్శు­లు తమతమ శాఖల పరి­ధి­లో పొ­దు­పు చర్య­లు, వర్క్ ఫ్ర­మ్ హోమ్ వి­ధా­నా­ల­పై అధ్య­య­నం చేసి.. ప్ర­త్యేక కా­ర్యా­చ­రణ రూ­పొం­దిం­చా­ల­ని ఆదే­శిం­చా­రు. అలా­గే.. రా­య­ల­సీమ, ప్ర­కా­శం జి­ల్లా­ల్లో ఇం­టి­గ్రే­టె­డ్ హా­ర్టీ­క­ల్చ­ర్ డె­వ­ల­ప్మెం­ట్ ప్లా­న్ కింద లక్ష కో­ట్ల రూ­పా­యల ఖర్చు ప్ర­ణా­ళి­క­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. పొ­దు­పు చర్య­ల్లో భా­గం­గా.. సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు, డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ లు తమ కా­న్వా­య్ లను తగ్గిం­చు­కు­న్నా­రు. సీఎం కా­న్వా­య్ 4 వా­హ­నా­ల­కే పరి­మి­త­మైం­ది. పై­లె­ట్, ఎస్కా­ర్ట్ వా­హ­నా­లు లే­కుం­డా­నే బు­ధ­వా­రం ఆయన సచి­వా­ల­యా­ని­కి వె­ళ్లా­రు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆదాయ వనరుల పెంపు అత్యంత కీలకమని భావిస్తున్న ప్రభుత్వం, వచ్చే ఆర్థిక సంవత్సరాల లక్ష్యాలపై దృష్టి సారించింది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన శాఖల పనితీరు, ఆదాయ వృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర సొంత ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల దిశగా సాగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,345 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం, 2025-26 నాటికి రూ.1,10,643 కోట్లకు చేరినట్లు తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ, గనులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు వంటి ప్రధాన శాఖల నుంచి గణనీయమైన ఆదాయం లభించినట్లు వెల్లడించారు. జీఎస్టీ ద్వారా రూ.33,679 కోట్లు, గనుల శాఖ నుంచి రూ.10,300 కోట్లు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.11,047 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.

పొదుపుచర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండొద్దు

పొదుపుచర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండొద్దు

పొదుపుచర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండొద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu