By - Sathwik |21 May 2026 6:00 PM IST
మహానాడులో అది ప్రతిబింబించాలన్న చంద్రబాబు
రాబోయే మహానాడును పార్టీ శక్తి, కార్యకర్తల ప్రాధాన్యత, సామాజిక వర్గాల భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిపే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.
మరోవైపు రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే ప్రక్రియపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు రెండింటినీ సమన్వయం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. పార్టీకి కార్యకర్తలే బలం అనే భావన మహానాడు వేదికపై స్పష్టంగా ప్రతిఫలించాలని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన ఆధారం అని, వారి పాత్రకు తగిన గుర్తింపు కల్పించేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. మహిళలకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత కూడా ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే పార్టీకి సంప్రదాయంగా మద్దతుగా నిలుస్తున్న వర్గాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ముఖ్యంగా జనాభాలో కీలక శాతాన్ని కలిగి ఉన్న బీసీ వర్గాలు పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్నాయని, వారి అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే సందేశం బలంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సామాజిక సమతుల్యత, అభివృద్ధి లక్ష్యాలను మహానాడు వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.
ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కూడా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలను ప్రారంభించి సమయపాలన పాటించాలని, ప్రతి వక్తకు కేటాయించిన అంశంపై మాత్రమే సంక్షిప్తంగా, స్పష్టంగా మాట్లాడేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో మహానాడులో ప్రవేశపెట్టనున్న 19 తీర్మానాలకు పొలిట్బ్యూరో ఆమోదం తెలిపింది.
పెట్టుబడుల పురోగతిపై సమీక్ష
మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల పురోగతిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల కమిటీతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. భాగస్వామ్య సదస్సుల్లో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల అమలు పురోగతిపై చర్చించారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 282 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చంద్రబాబు గుర్తు చేశారు. వీటిలో ఇప్పటికే 114 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాయని లోకేశ్ వివరించారు. మిగిలిన ప్రాజెక్టులను కూడా త్వరితగతిన అమల్లోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలపై సమావేశంలో చర్చించారు.
విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా కుదిరిన ప్రతి ఒప్పందం వేగంగా అమల్లోకి రావాలని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపుల ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
రాబోయే మహానాడును పార్టీ శక్తి, కార్యకర్తల ప్రాధాన్యత, సామాజిక వర్గాల భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిపే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. మరోవైపు రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే ప్రక్రియపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు రెండింటినీ సమన్వయం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. పార్టీకి కార్యకర్తలే బలం అనే భావన మహానాడు వేదికపై స్పష్టంగా ప్రతిఫలించాలని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన ఆధారం అని, వారి పాత్రకు తగిన గుర్తింపు కల్పించేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. మహిళలకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత కూడా ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే పార్టీకి సంప్రదాయంగా మద్దతుగా నిలుస్తున్న వర్గాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ముఖ్యంగా జనాభాలో కీలక శాతాన్ని కలిగి ఉన్న బీసీ వర్గాలు పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్నాయని, వారి అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే సందేశం బలంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సామాజిక సమతుల్యత, అభివృద్ధి లక్ష్యాలను మహానాడు వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.
పెట్టుబడుల పురోగతిపై సమీక్ష
పెట్టుబడుల పురోగతిపై సమీక్ష
పెట్టుబడుల పురోగతిపై సమీక్ష

